సింగిల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవటమంటే మామూలు విషయం కాదు. సినిమా క్లిక్ అవ్వాలి.. అందం ఉండాలి.. అభినయం కూడా తోడవ్వాలి. మొత్తానికి అదృష్ఠం కూడా ఉండాలి. ఇవన్నీ కలబోసుకుని ఉత్తరాది నుంచి వచ్చిన భామ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో చేసిన మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వెనుతిరిగి చూడని రకుల్ ఏకంగా స్టార్ హీరోల పక్కన చాన్సులు దక్కించుకుంది. మెయిన్ హీరోయిన్ గా టాప్ 3 పొజిషిన్ లో ఉంటూ ఓ రెండు మూడేళ్లు ఏలేసింది.

 

 

కానీ రెగ్యులర్ కంటెంట్ మూవీస్ మాత్రమే ఆమెకు వచ్చాయి కానీ.. నటనకు అవకాశం ఉన్న పాత్రలు రాలేదనే చెప్పాలి. పైగా.. ఆమె సినిమాలు ఫ్లాప్ కూడా కావటంతో అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశాలు తగ్గటంపై ఇటివల ఓ బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్షన్ లో మాట్లాడింది. కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అని మళ్లీ తనకు అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందంటోంది. టాలీవుడ్ లో హీరోల ఆధిపత్యం, హీరోయిన్లకు తక్కువ.. హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్లు గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసింది. అక్కడి హీరోలకు హీరో వర్షిప్ ఉంటుంది. వారు మాత్రమే సినిమాలకు క్రేజ్, ఓపెనింగ్స్, కలెక్షన్స్ తీసుకొస్తారు. అందుకు వారికిచ్చే రెమ్యునరేషన్లు కరెక్టే.

 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక మందన, పూజా హేగ్డే హవా కొనసాగుతోంది. వరుస హిట్లతో, వరుస అవకాశాలతో టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ ను పట్టించుకునే వారు లేరు. వీరిద్దరి కాల్షీట్లు ఖాళీ లేవంటే మాత్రమే వేరే హీరోయిన్ గురించి ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరి రకుల్ టాలెంట్ ను గుర్తించి ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: