పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన పింక్ సినిమా అధికారిక తెలుగు రీమేక్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా నివేత థామస్, మల్లేశం మూవీ ఫేమ్ అనన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా తో పాటు అతి త్వరలో పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. 

 

పవన్ కళ్యాణ్, రాబిన్ హుడ్ తరహా గజదొంగ పాత్రలో నటించనున్న ఈ సినిమా, పాన్ ఇండియా ఫీల్ తో మొఘలాయుల కాలం నాటి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన బాలీవుడ్ నటి వాణీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. కొన్నేళ్ల క్రితం నాని హీరోగా వచ్చిన ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు వారికి వాణి కపూర్‌ పరిచయం అయ్యింది. ఆ సినిమా మాత్రం ఇక్కడ పరాజయం పాలవడంతో, ఆ వెంటనే బాలీవుడ్‌ లో ఈ అమ్మడు సెటిల్‌ అయ్యింది. 

 

ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా అమ్మడు కాదని బాలీవుడ్‌కే పరిమితం అయ్యింది. అస‌లు వాణీక‌పూర్‌ను మ‌నోళ్లు ఎప్పుడో మ‌ర్చిపోయారు అనే చెప్పాలి. ఆమె బాలీవుడ్‌లోనూ అంత స్టారేం కాదు కూడా, అయితే ఎందరో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఉండగా, పోయి పోయి దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ ససరన ఇటువంటి పెద్దగా పేరు లేని హీరోయిన్ ని ఎంచుకోవడంపై కొందరు పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: