స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత రెండేళ్లుగా చేసిన సినిమాల రిజల్ట్ తో పెద్దగా ఆనందంగా లేడనే చెప్పాలి. ముందుగా రెండేళ్ల క్రితం ఆయన నటించిన డీజే సినిమా, యావరేజ్ విజయాన్ని అందుకున్నా, ఆయన ఫ్యాన్స్ ఆశించిన రేంజ్ విజయాన్ని మాత్రం ఆ సినిమా అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా పేరు సూర్య సినిమా అయితే ఘోరంగా విఫలం అయింది. దానితో కొంత ఆలోచనలో పడ్డ బన్నీ, ఎట్టకేలకు తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయడానికి సిద్ధం అయ్యారు. 

 

ఆ విధంగా వారిద్దరి కాంబోలో తెరకెక్కి ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అలవైకుంఠపురములో. సంక్రాంతి సీజన్ కావడంతో పాటు సినిమాకు మంచి టాక్ రావడంతో 
అల సినిమా బాగా కలెక్షన్స్ రాబట్టి, బన్నీ కెరీర్ లో మంచి విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఇక ఆ సినిమా స‌క్సెస్ కి బన్నీ సహా సినిమా యూనిట్ మొత్తం ఎంతో ఆనందం వ్యక్తం చేయగా, బన్నీ అయితే మరింతగా సంతోషపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అల టీమ్, మూడు పార్టీలు ఇవ్వడం జరిగింది. 

 

ఇక ఇంకా వారు సక్సెస్ ఎంజాయ్‌ చేసే మూడ్ లోనే ఉన్నారు. ఇక నిన్న తిరుపతికి తన కుటుంబ సమేతంగా చేరుకున్న బన్నీ, సినిమా సక్సెస్ సాదించడంతో స్వామి వారి సన్నిధానానికి వచ్చినట్లు చెప్పారు. ఈ విధంగా అల సక్సెస్ తో ఫ్రెండ్స్‌కు, ద‌ర్శ‌కుల‌కు, మీడియాకు పార్టీలు ఇస్తూ ఫుల్ జోష్ మీదున్న బన్నీ, మ‌రో వైపు సుకుమార్ సినిమా షూటింగ్ కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: