తెలుగు ఇండస్ట్రీలో దిల్ చిత్రంతో మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు తెలుగు లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.  ఆయన తెలుగు ఇండస్ట్రీలో నిర్మించిన చిత్రాల్లో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  దిల్ రాజు ఎంతో మంది ఔత్సాహికులకు ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు ఇచ్చారు.  ఈయన నిర్మాణంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇతరు నటులు పరిచయం అయ్యారు.  తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఇటీవల వెండి తెరను తాకిన 'జానూ' చిత్రం మంచి టాక్ ను తెచ్చుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోగా, చిత్ర బృందం తిరుమలకు వచ్చి, నేటి ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామిని దర్శించుకుంది. 

 

తమ నిర్మాణంలో వచ్చిన జాను మంచి విజయం అందుకోవడంతో వెంకన్న మొక్కులు తీర్చుకున్నారు.  సినిమా హిట్ కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు దర్శనం అనంతరం దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. సినిమాలో శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారని తెలిపారు. నిర్మాత దిల్ రాజు, సమంత తదితరులు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ, తిరుమలకు చేరుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో హీరో శర్వానంద్ కూడా ఉన్నారు.  తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 మూవీ మంచి సక్సెస్ కావడంతో దిల్ రాజు ప్రత్యేక షో వేయించుకొని చూశారట. 

 

అప్పటి నుంచి ఆ మూవీ రిమేక్ ప్లాన్ చేశారు.  అంతే కాదు సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకొని త్వరతగతిన పూర్తి చేశారు. సినిమాలో శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారని తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ ను మార్చిలో విడుదల చేస్తామని, మేలో వేసవి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు. దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాన్ మూవీ అనగానే భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: