బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలో వరుస విజయాలు అందుకుంటూ దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా తెలుగు హిట్ సినిమాలు రిమేక్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నారు.  గతంలో మహేష్ బాబు నటించిన పోకిరి రిమేక్ గా వాంటెండ్ మూవీలో నటించారు.  తాజాగా మరో రిమేక్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  గత కొన్నేళ్లుగా సల్మాన్ ఏ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడడం లేదు. దానితో సల్మాన్ క్రేజ్ పడిపోతుంది.. అందుకే అలా వైకుంఠపురంలో రీమేక్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్.   

 

గత రెండేళ్ల క్రితం నా పేరు సూర్య మూవీతో డిజాస్టర్ పొందిన అల్లు అర్జున్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.  తనకు గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీలో సామజవర గమన, రాములో రాముల లాంటి సాంగ్స్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.  తాజాగా ఈ మూవీ ఇతర భాషల్లో కూడా రిమేక్ ప్లాన్ చేస్తున్నారు.  అయితే బాలీవుడ్ లో ఈ మూవీ రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.  అలా వైకుంఠపురంలో రీమేక్ రైట్స్ ని 8 కోట్లకి అశ్విన్ వర్థే కొనగా... హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరో క్రేజీ బాలీవుడ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

 

అలాగే బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా హిందీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాని రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో సల్మాన్ ఉన్నాడట.  గతంలో తెలుగులో ఎన్నో రిమేక్స్ వస్తున్న విషయం తెలిసిందే.  కానీ సల్మాన్ ఖాన్ మాత్రం సెలెక్టెట్ రిమేక్స్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నారు.   అలా వైకుంఠపురంలో డిజిటల్, శాటిలైట్ హక్కులను జెమిని వాళ్లు భారీ రేటుకే కొనుగోలు చేసారని.. ఈ సినిమా విడుదలైన రోజునుండి 87 రోజుల తర్వాత డిజిటల్ ప్లేట్ ఫామ్ లో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: