కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఒకే సమయంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఒకరు చాలాకాలం వరకు విలన్ గా మెప్పించగా మరొకరు కేవలం రెండు సినిమాలకు మాత్రమే విలన్ గా నటించి ఆ తర్వాత కథానాయకుడి పాత్రలో నటించి అద్భుతమైన నటనని తెలుగు ప్రేక్షక అభిమానులకు రుచి చూపించాడు. అయితే వీళ్లిద్దరి మధ్య ఒక చెప్పుకోతగ్గ స్నేహబంధం ఉంది. ఆ స్నేహబంధం చాలా సందర్భాల్లో కూడా బయటపడింది. మొన్నీమధ్య మోహన్ బాబును చిరంజీవి ఆప్యాయత గా ముద్దు పెట్టుకొని తన స్నేహబంధం ఎంత గట్టిగా ఉందో చెప్పకనే చెప్పారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ అరుదైన క్షణాలు చాలామందిని ఫిదా చేశాయి.



ఇదిలా ఉంటే... మోహన్ బాబు చిరంజీవి తదుపరి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించబోతున్నారని.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఒకటి విడుదలైందని నెట్టింట వార్తలు హోరెత్తుతున్నాయి. సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న మోహన్ బాబు మళ్లీ చిరంజీవి సినిమాలో నటిస్తే అది ఒక సంచలనమే అవుతుంది. ప్రస్తుతానికి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'గోవింద ఆచార్య' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో మోహన్ బాబు చాలాసార్లు ప్రతినాయకుడిగా నటించాడు. చివరిగా కొదమ సింహం లో విలన్ గా మోహన్ బాబు నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు.


మళ్లీ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక భారి సెట్ ఏర్పాటుచేసి హీరో చిరంజీవిపై ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. అతి తొందరలోనే ఈ అసెంబ్లీ రౌడీ స్టేట్ రౌడీ కోసం మళ్లీ మొహానికి మేకప్ పూసుకొని ప్రతినాయకుడిగా వెండితెరపై నటించనున్నాడనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: