టాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ కొన్ని సందర్భాలలో సంచలనమైన విషయాలని, అంశాల్ని పబ్లిక్ లో ప్రస్తావించటం గాని.. ప్రకటించటం గాని అస్సలు చేయరు. సాధ్యమైనంతవరకు పబ్లిక్ ఫంక్షన్స్ లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు తప ఒక్క మాట కూడా తూలరు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కంప్లీట్ గా పాజిటివ్ తప్ప.. నెగిటివ్ విషయాల గురించి మాట్లాడరు. అలాంటి రూల్స్ ను బ్రేక్ చేశారు విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నాలు ఇద్దరూ. వీరిద్దరూ కలిసి చేసిన తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో విజయ్ సంచలన వ్యాఖ్య చేశారు.

 

తానిక ప్రేమకథాంశాల్ని చేయనని.. తన అభిరుచులు మారుతున్నట్లుగా, మార్చుకుంటున్నట్లుగా ప్రకటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తన చివరి ప్రేమకథాచిత్రంగా వెల్లడించారు. ఈ మాట మీద ఎవరూ రియాక్ట్ కాలేదు. కాని.. లవ్ స్టోరీలకు సంబందించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావటాన్ని మాత్రం కొంతమంది జీర్ణించుకోలేకపోయారు.

 

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాటకు ఎవరూ రియాక్ట్ కాకపోయినప్పటికి.. అనూహ్యంగా ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా స్పందించి షాకిచ్చింది. విజయ్ ప్రకటించిన చివరి లవ్ స్టోరీ మాట కరెక్టు కాదన్నారు. తనకు తెలిసినంత వరకూ విజయ్ కు మహిళా అభిమానులతో పాటు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగా ఎక్కువని.. వారంతా విజయ్ ను ప్రేమకథా చిత్రాల్లోనే చూడాలని ఇష్టపడతారన్నారు. అందుకే అభిమానుల కోణంలో ఆలోచించి.. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ లోనే నటిస్తాడని తను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

 

విజయ్ వ్యాఖ్య మీద ఎవరూ స్పందించని సమయంలో.. రాశీ ఖన్నా మాత్రం అందుకు భిన్నంగా ఓపెన్ అయిన విధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనికి విజయ్ స్పందన ఏమిటో చూడాలి. అయితే కావాలనే కొందరు విజయ్ కి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చి అవి కాస్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ మధ్య విజయ్ లో కాస్త తేడా వచ్చిందని దాని ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉందని అంటున్నారు. అదే గనక జరిగితే విజం జీవితం అంతే అని చెప్పుకుంటున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: