ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజియస్ట్ హీరో ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ పేరు. అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తర్వాత బాలీవుడ్ స్థాయిలో పేరు గడించాడు. చాలా కొత్త కాన్సెప్ట్స్ తీసుకుంటూ రాబోయే యంగ్ హీరోలకు సూత్రధారిగా నిలుస్తున్నాడు విజయ్. గీత గోవిందం సినిమా తో తన సత్తా నిరూపించుకున్న యాంగ్రీ యంగ్ మాన్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ నలుగురు భామలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు.

 

ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 తేదీన రిలీజ్ కానున్న చిత్రం గురించి మాట్లాడే క్రమంలో చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఒకరైన రాశి ఖన్నా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దిరోజుల క్రితమే విజయ్ సినిమా తన కెరీర్ లోనే చివరి లవ్ స్టోరీ అని…. అందుకే చిత్రాన్ని అభిమానులకు కావాల్సినన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్ తో నింపేశాను అని చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయమై రాసి ఖన్నా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

 

ప్రేమ కథా చిత్రాలలోనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దేవరకొండ చేసిన మాటలను పలువురు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పిన రాశిఖన్నా.... విజయ్ ప్రకటించిన చివరి లవ్ స్టోరీ స్టేట్మెంట్ ముమ్మాటికీ కరెక్ట్ కాదు అనింది. తనకు తెలిసినంత వరకూ విజయ్ కు మహిళా అభిమానులు ఎక్కువ అని.. వారంతా అతను ప్రేమకథా చిత్రాలలో కనపడకపోతే అసలు ఊరుకోరని చెప్పింది రాశీ ఖన్నా. విజయ్ కు మరియు అమ్మాయిలు అందరికీ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి తనకు బాగా తెలుసని…. వారికోసం అయినా అతను మళ్ళీ ప్రేమకథా చిత్రాల్లో నటిస్తాడని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది రాశి. ఇక రాశి ఖన్నా అన్న మాటలపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: