పూజా హెగ్డే... అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది... హాట్ హాట్ అందాలతో అందరికీ చెమటలు పట్టించి... దర్శక నిర్మాతలు అందరికీ ప్రస్తుతం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన హీరోయిన్. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనదైన నటనతో ఆకట్టుకుంది పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు... ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి.. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. పూజ హెగ్డే అందం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం పూజా హెగ్డే సొంతం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ అమ్మడు. కాగా  తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన అలా వైకుంఠపురం సినిమాలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 అల వైకుంఠపురం సినిమాలో ఎంతో క్యూట్ గా నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ. అంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో నటించి మంచి విజయాన్ని కూడా అందుకుంది. మహర్షి గద్దల కొండ గణేష్ అలా వైకుంఠపురములో ఇలా స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేసి విభిన్నమైన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. మొన్నటికి మొన్న విడుదలైన అలా వైకుంఠపురములో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకు పోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి రికార్డు ల వర్షం కూడా కురిపిస్తోంది. 

 

 ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కు సంబంధించిన వార్త ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడితో  ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.గత  సంవత్సరం హిందీలో వచ్చిన బజార్ చిత్రం లో పాపులర్ అయిన సీనియర్ స్టార్ వినోద్  మెహ్రా కుమారుడు రోహాన్ తో  పూజా హెగ్డే ప్రేమలో పడిందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు... ప్రస్తుతం పూజా హెగ్డే అతనితో డేటింగ్ లో కొనసాగుతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాలంటే ఈ ఇద్దరిలో ఒకరు నోరు విప్పాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో ఓ సినిమాలో నటిస్తుండగా అటు అక్కినేని అఖిల్ తో కూడా మరో సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: