‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక అదరగొట్టే రీతిలో జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు విజయ్ దేవరకొండ అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్నారు. కాగా సినిమా స్టిల్స్ అర్జున్ రెడ్డి తరహాలో ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మొన్నటి వరకు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై విజయ్ దేవరకొండ కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ పై ఐశ్వర్య రాజేశ్ (తమిళ నటి) ఫ్రెండ్స్ పిచ్చ సీరియస్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

 

ఫ్రెండ్ అనే ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్లు చాలా వల్గర్ గా విజయ్ దేవరకొండ మాట్లాడిన తీరు ఉందని స్పీచ్ ఉన్న చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేశ్ (తమిళ నటి) ఉద్దేశించి మాట్లాడిన తీరు ఏంటంటే..‘ఏందే నీ యవ్వ.. గారు గారు అంటున్నావ్’ అంటున్నావ్ అంటూ మాట్లాడిన మాట ఊర మాస్ గా అప్పటికప్పుడు ఇన్ స్టెంట్ గా రావడంతో చాలా మంది ముఖంలో నవ్వులు రాగా మరికొంతమంది ముఖంలో విజయ్ మాట తీరు పై తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది.

 

పబ్లిక్ గా ఎంత మంది ప్రేక్షకుల ముందు అభిమానుల ముందు ఒక అమ్మాయిని ఉద్దేశించి ఆ విధంగా విజయ్ దేవరకొండ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ కొంతమంది విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ కి వేసిన ఈ డైలాగ్ కి సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్ అయితే ఏరా.. పోరా.. లాంటి మాటలు మామూలే. మోతాదు మించితే.. నీ యమ్మ.. నీ యవ్వ అనటం చాలా దారుణమని విజయ్ దేవరకొండ ఏమైనా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మరికొంతమంది సూచిస్తున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: