టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. పిల్లా నువ్వులేని జీవితం మూవీ తో మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. గత ఏడాది చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో వరుస విజయాలు అందుకొని మంచి ఫామ్ లోకొనసాగుతున్నాడు. తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న సినిమా ఉప్పెన. ఈ మూవీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరక్కుతుందని సమాచారం. ఈ మూవీ చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కృతి శెట్టి పరిచయమవుతోంది. ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. 'రాయనం' పాత్రలో ఆయన కనిపించనున్నాడు. సముద్ర తీరంలో బ్లాక్ అంబాసిడర్ కారు పక్కనే మాస్ లుక్ తో విజయ్ సేతుపతి చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు జాలరి గూడానికి చెందినవాడిగా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
కొత్త తరహా కథ, కథనాలతో నేటివిటీకి దగ్గరగా అత్యంత సహజత్వంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న మూవీ విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. గతంలో ఈ తరహా మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఎన్నో వచ్చాయి. మరి మత్సకారుల నేపథ్యంలో ఈ మూవీ వైష్ణవ్ ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చూపిస్తాడో చూడాలి. సాయిధరమ్ తేజ్ ఫస్ట్ రిలీజ్ సినిమా పిల్లా నువ్వులేని జీవితంతోనే ప్రేక్షకులను కట్టిపడేశాడు.