మెగా బ్రదర్ నాగబాబు మొదట్లో మెగాస్టార్ సోదరుడిగా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో పలు పాత్రల్లో నటించడం జరిగింది. అలానే దానితో పాటు అదే సమయంలో సోదరుడు చిరంజీవి హీరోగా తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించిన నాగబాబు, ఇటీవల రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ అనే సినిమాని నిర్మించారు. అయితే ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ కావడంతో అక్కడి నుండి సినిమా నిర్మాణానికి దూరం అయిన నాగబాబు, మెల్లగా బుల్లితెరపై దృష్టిపెట్టి, అదే సమయంలో ఈటివి ఛానల్ లో ప్రారంభం అయిన జబర్దస్త్ అనే కామెడీ షో కి జడ్జిగా వ్యవహరించారు. 

 

ఇక అక్కడి నుండి అదే షో కు దాదాపుగా ఏడేళ్లపాటు జడ్జిగా తన సేవలందించిన నాగబాబు, ఇటీవల ఆ షో నిర్వాహక సంస్థ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ లోని కొందరు సభ్యుల ప్రవర్తన తనకు నచ్చకపోవడంతో షో నుండి బయటకు వెళ్ళిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోకు జడ్జి గా వ్యవహరించడం స్టార్ట్ చేసిన నాగబాబు, ఆ షోను జబర్దస్త్ మాదిరిగా ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొదట మంచి క్రేజ్ తో ప్రారంభం అయిన ఆ షో పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం ఆ షో చాలా వరకు విఫలం అయినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. 

 

ఇక ఇటీవల ఒకింత మెల్లగా పుంజుకుంటున్న ఈ షో  రేటింగ్స్, మధ్యలో ఒక్కోసారి మరీ దారుణంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా జబర్దస్ నే చాలావరకు అనుకరణ చేస్తూ సాగుతుండడంతో పాటు, షోలో ప్రేత్యేకించి కొత్తదనం ఏమి కనపడడం లేదని కొందరు అంటుంటే, ఆ షోలో సరైన కంటెస్టెంట్స్ లేకపోవడం వల్లనే రేటింగ్స్ రావడం లేదని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అదిరింది షో ని మంచి సక్సెస్ చేసి పేరు దక్కించుకుందాం అనుకున్న నాగబాబుకు అది జరుగకపోగా, షో పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతూ, జబర్దస్త్ దెబ్బకు చావు తప్పి కన్ను లొట్టపడినట్లు తయారయిందని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: