పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో వచ్చిన క్రేజ్ తో నే తన నెక్స్ట్ సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమాలని కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నాడు. అలా తెరకెక్కించిన సాహో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలన్ని తారుమారు అయిపోయాయి. భారీ డిజాస్టర్ గా మిగిలింది సాహో. కోట్లలో నష్టం రావడమే కాదు ఈ సినిమా విషయంలో ప్రభాస్ కూడా తూవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. అందులో నుండి తేరుకొని నెమ్మదిగా ప్రభాస్ కొత్త సినిమా జాన్ ని మొదలు పెట్టాడు. ఏ ముహూర్తాన మొదలు పెట్టారో జాన్ సినిమా... గాని టైటిలే మారిపోయి 'రాధేశ్యామ్' అయింది.  

 

విదేశాల్లో వింటేజ్ సెట్ ల మీద సెట్ లు వేసి షూట్ చేసారు. దానికే కోట్లు ఖర్చయిపోయింది. అది చాలదన్నట్లు మళ్లీ అన్నపూర్ణ స్టూడియోలోను సెట్ వేసారు. దాంట్లో ప్రభాస్ ఫొటో దిగి బయటకు వదిలారు. ఇప్పుడు అదీ చాలదన్నట్లు మళ్లీ ఇంకా సెట్ ల మీద సెట్ లు వేస్తున్నారట. సెట్ లు వేయడానికి కోట్లు, ఫ్లోర్ అద్దెలు ఇలా అంతా తడిసి మోపెడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ లాంటి హీరోతో చకచకా సినిమా తీసుకుంటే కాస్త డబ్బులు మిగుల్తాయి అనుకుంటే ఈ సెట్ లు అన్నీ కలిసి బడ్జెట్ ను అమాంతం పెంచేస్తున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. 

 

సాహో సినిమా తరువాత తలెత్తిన పరిస్థితుల కారణంగా రాథేశ్వామ్ బడ్జెట్ ను వీలయినంత కంట్రోల్ చేయాలనుకున్నా, ఈ సెట్ ల కారణంగా అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. పైగా సెట్ వేయడానికి, షూటింగ్ కు, మిగతా వ్యవహారాలు అన్నింటికి కలిపి ఫ్లోర్ అద్దెలు కూడా భారీగానే అవుతున్నట్లు టాక్. పైగా ఈ సినిమా కూడా ఇప్పట్లో విడుదల కాదంటున్నారు. అసలే డార్లింగ్ ఫ్యాన్స్ సాహో ఫ్లాపయిందని ఫీలవుతున్నారు. కనీసం ఈ సినిమా అయినా భారీ హిట్ అయితే అది బ్యాలెన్స్ అవుతుందని చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం లోలోపల తెగ టెన్షన్ పడుతున్నాడట. బడ్జెట్ పెరిగి ఎలా అయితే సాహో చమటలు పట్టించిందో అలా ఈ సినిమా కూడా భయపెడుతుందేమోనని కంగారు పడుతున్నాడట. ఇక పెళ్ళి విషయంలోను ఇదే టెన్షన్ పడుతున్నాడట. ఇవన్ని బయటికి చెప్పుకోలేక చులకనైపోతామన్న మనో వ్యధతో ఉన్నాడట పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి: