అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున తర్వాత మళ్ళీ ప్రేమించి పెళ్ళి చేసుకుంది నాగ చైతన్య నే. మధ్యలో సుమంత్ ఇలాగే కీర్తి రెడ్డి ని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికి అర్ధాంతరంగా ఆ పెళ్ళి పెటాకులైంది. ఇద్దరు విడిపోయి ఎవరి దారిన వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తండ్రి నాగార్జున లాగా నాగ చైతన్య మాత్రం తన లవ్ ని సక్సస్ ఫుల్ చేసుకున్నాడు. నాగార్జున అప్పట్లో అమలని ప్రేమించాడు. అమల కెరీర్ హీరోయిన్ గా మాంచి పీక్స్ లో ఉండగానే నాగార్జున తో నిండా ప్రేమలో మునిగిపోయింది. అప్పటికే అమల నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్స్ తో నటించి ఫేమస్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కొనసాగుతోంది.

 

అయితే నాగార్జున ప్రేమించినప్పటినప్పటి నుంచి కొన్నాళ్ళు ఆ ప్రేమని గోప్యంగా ఉంచాడు. కాని ఒకానొక సందర్భంలో వీళ్ళ పెళ్ళి మ్యాటర్ అక్కినేని నాగేశ్వర రావు కి తెలియడంతో నాగార్జున ని అమల విషయంలో వారించారట. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవద్దని చాలా కఠినంగా చెప్పాడట. అంతేకాదు అప్పట్లో నాగార్జున కి అమల విషయంలో ఎవరూ సపోర్ట్ కూడా చేయలేదని చెప్పుకున్నారు. ముఖ్యంగా నాగేశ్వరరావు కి అసలు అమల అంటే ఇష్ఠముండేది కాదట. అయినప్పటికి నాగార్జున అమలే కావాలని ఇంట్లో అందరితోను మనస్పర్ధలు వచ్చినప్పటికీ పట్టు విడవని విక్రమార్కుడిలా ఒంటరి పోరాటం చేశాడు. ఎట్టకేలకి నాగ్ పంతమే నెగ్గింది. ప్రేమ ముందు ఏ పప్పులు ఉడకలేదు. ఇద్దరు ఒక్కటైయ్యారు.

 

ఇక నాగ చైతన్య కూడా అలాగే ఏం మాయ చేశావే సినిమాతో సమంత మాయలో పడిపోయాడు. మొదటి సినిమా నుండే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టి చాలా కాలం ప్రేమికులుగా కొనసాగారు. అప్పట్లో నాగార్జున కి ఎదురైన పరిస్థితులే నాగ చైతన్యకి ఎదురయ్యాట. చైతూ కి సమంత ని ఇచ్చి పెళ్ళి చేయడానికి ఒప్పుకోలేదని చెప్పుకున్నారు. కానీ అతి తక్కువ కాలంలోనే వీరిద్దరి ప్రేమని అర్థం చేసుకున్న నాగ్ ఏ కుటుంబం లో జరగని విధంగా రెండు మత సిద్దాంతాల ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించారు. వీరి పెళ్ళికి పలువు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, సన్నిహితులు హాజరై సందడి చేశారు. 

 

అయితే అప్పట్లో అమల పడ్డ టెన్షన్సే ఇప్పుడు సమంత పడిందట. కానీ ఈ కోడళ్ళిద్దరు ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో చక్కగా ఒదిగిపోయారు. అక్కినేని ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆ కుటుంబంలో ఇమిడి పోవడం ఎంతో గొప్ప విషయం. అదే ప్రేమ కి ఉన్న పవర్.

మరింత సమాచారం తెలుసుకోండి: