సోష‌ల్ మీడియా పెరిగిన ద‌గ్గ‌ర నుంచి కొత్త యాప్స్ అన్నీ అందుబాటులోకి రావ‌డంతో ఎక్క‌డ ఏ మూలనో ఉంటున్న కొత్త కొత్త వాళ్ళంతా ప‌రిచ‌యం కావడం. అలాగే కొత్త కొత్త టాలెంట్‌ల‌న్నీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆ మధ్య వ‌చ్చిన డ‌బ్ స్మాష్ నుంచి ప‌రిచ‌య‌మైన అషురెడ్డి అనే యువ‌తి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇక ఈ భామ సోష‌ల్ మీడియాలో జూనియ‌ర్ స‌మంత‌గా పేరుగాంచింది. ఈమె చేసే డ‌బ్ స్మాష్‌ల‌తో ఆమెకు ఒక సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. కానీ ఆశించినంత పేరు మాత్రం రాలేదు. ఇక ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ భామ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ అయ్యేలా కాస్త బొద్దుగా మారింది. ఆ స‌మయంలోనే సోష‌ల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. త‌ర్వాత తిరిగి మ‌ళ్ళీ స‌న్న‌గా మారి అంద‌రికి షాక్ ఇచ్చింది. 

 

ఇక ఇదిలా ఉంటే... అషురెడ్డి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి వీరాభిమాని అన్న విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే అప్ప‌ట్లో అషురెడ్డి ప‌వ‌న్ పేరును టాటూగా వేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు మ‌రోసారి ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. 2018లో పవన్ ఫ్యాన్స్ కి క్రిటిక్ కత్తి మహేష్ కి సోషల్ మీడియా వార్ జరుగుతున్న సమయంలో.. అషురెడ్డి తన టాటూ వేసుకున్న ఫొటోల‌ను షేర్ చేసింది.  

 

నేను ప‌వ‌న్ టాటూ వేయించుకున్నా అంటే నాకు, ప‌వ‌న్‌కి ఎఫైర్ ఉన్న‌ట్లా.. జవాబు చెప్పండి' అంటూ కత్తి మహేష్ పై విరుచుకుపడింది. అప్పట్లో అషురెడ్డి టాటూ వార్త సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. మ‌ళ్ళీ ఇప్పుడు అదే ఫొటోని మ‌రోసారి అషురెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళ‌కు మ‌త్తెక్కిస్తోంది. ఇంత‌కీ ఈ ప్రైవేట్ పార్ట్ పై ప‌వ‌న్ టాటూ వేసుకుని మాట్లాడితే ఆ ఫొటోల‌ను పోస్ట్ చేయ‌డం పై ఈ డ‌మ్‌స్టాష్ స్టార్ ఆంత‌ర్య‌మేమిటో అనుకుంటున్నారు కొంద‌రు. ఇక మొత్తానికి ఏదిఏమైన‌ప్ప‌టికీ బిగ్‌బాస్ సీజ‌న్ 3లో పాల్గొని బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ భామ‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: