సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు టాలీవుడ్కి పండగ మొదలైనట్లే. ఒక్క టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ ఏంటి ఎక్కడైనా పండగే. నిర్మాతలకు ఇదే పెద్ద పండగ అని చెప్పాలి. సంక్రాంతికి సినిమాలు ఏ స్థాయిలో అయితే పోటీపడతాయో అదే స్థాయిలో తిరిగి సమ్మర్ హాలీడేస్కి పోటీపడతాయి. సమ్మర్ అంటే దాదాపు అందరి పరీక్షలు అయిపోయి అన్నీ హాలీడేస్ ఎక్కువగా ఉండడంతో నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి మంచి సీజన్ అని చెప్పాలి. అందుకే ఎక్కువగా సమ్మర్లో కూడా సినిమాలు విడుదలవుతాయి. అంతేకాక ప్రత్యేకంగా కొన్ని సినిమాలు సమ్మర్ కోసమని అలా ఉంటాయి. 2020 సమ్మర్లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు నాని, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి కుర్ర హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ సమ్మర్ను టార్గెట్ చేసిన ఆ హీరోలెవరో ఓ లుక్కేద్దాం.
మహానటి లాంటి అద్భుతమైన చిత్రంలో నటించిన తర్వాత కీర్తి సురేష్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. మన్మథుడు 2లో చిన్న పాత్రలో మెరిసినప్పటికీ పెద్దగా ఆ పాత్రకి ప్రాముఖ్యత లేదు. ఇక ఇప్పుడు మిస్ ఇండియా అంటూ పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది కీర్తి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం మార్చ్ 6న విడుదల కానుంది. నరేంద్ర నాథ్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న వి చిత్రం కూడా ఈ బరిలో నిలుచుంది. ఈ చిత్రంలో నాని విలన్. అంతేకాదు ఇది ఆయనకు 25వ సినిమా కూడా. పూర్తిస్థాయి ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు నాని. సుధీర్ బాబు ఇందులో హీరో. మార్చ్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
శర్వానంద్ కూడా ఈ సమ్మరి `శ్రీకారం` చుట్టారు. కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఎప్రిల్ 2న విడుదలకు సిద్ధం కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో `ఉప్పెన`లా రాబోతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇస్మార్ట్ శంకర్ లాంటి సంచలన విజయం తర్వాత రామ్ నటిస్తున్న సినిమా రెడ్. తమిళనాట విజయం సాధించిన తడమ్ సినిమాకు రీమేక్ ఇది. కిషోర్ తిరుమల తొలిసారి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎప్రిల్ 9న ఈ సినిమా రానుంది. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా మాస్టర్. ఈ చిత్రం ఎప్రిల్ 10న విడుదల కానుంది. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఎప్రిల్ 17న విడుదల కానుంది.
సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు సాయి ధరమ్ తేజ్. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే లాంటి విజయాలతో దూకుడు మీదున్న సాయి.. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఎప్రిల్ 24న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అసురన్ సినిమాకు రీమేక్గా వెంకటేష్ నటిస్తున్న సినిమా నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 1న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా పింక్ రీమేక్. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. కేవలం 25 రోజుల్లోనే పవన్ పార్ట్ పూర్తి చేయనున్నారు దర్శక నిర్మాతలు. మే 15న పింక్ రీమేక్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. వైల్డ్ డాగ్ గా నాగార్జున అక్కినేని హీరోగా కొత్త దర్శకుడు సోల్మోన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో NIA అధికారిగా ఇందులో నటిస్తున్నాడు నాగ్. ఈ సినిమాను మే 22న విడుదల చేయబోతున్నారు.
చాలా గ్యాప్ తర్వాత రానా సినిమా రాబోతుంది. అదే విరాట పర్వం. ఇందులో సాయి పల్లవి, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాను మే లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సినిమా రంగ్ దే. మే లోనే సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
హ్యాట్రిక్ ఫ్లాపులతో డీలా పడిపోయిన అక్కినే హీరో అఖిల్.. తన నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా సమ్మర్లోనే విడుదల కానుంది. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. మేలోనే సినిమా విడుదల కానుంది. ఈ సమ్మర్ చివరి సినిమా ఇదే కావచ్చు. ఇందులో తమన్నా, గోపిచంద్ జంటగా నటిస్తున్నారు. కబడీ కోచ్గా కనిపించబోతున్నట్లు సమాచారం.