ప్రస్థుతం ఆరోగ్య కారణాల రీత్యా అమెరికాలో ఉన్న మహేష్ తిరిగి హైదరాబాద్ రావడానికి మరొక నెల రోజులు పడుతుంది అని అంటున్నారు. అయితే పేరుకు మహేష్ అమెరికాలో ఉంటున్నా వంశీ పైడిపల్లి తో మాత్రం నిరంతరం టచ్ లో ఉంటూ మే నుండి ప్రారంభం కాబోతున్న తన మూవీ కథకు సంబంధించిన చర్చలు ఫోన్ ద్వారా కొనసాగిస్తున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్మూవీ కథను ఫైనల్ చేయడంతో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన స్క్రీన్ ప్లే డైలాగ్స్ వెర్షన్ పై వంశీ పైడిపల్లి దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా డాన్ లుక్ లో కొంతసేపు కనిపించబోతున్న మహేష్ బాబు మూవీ టోటల్ కథ మాత్రం ఊహించని విధంగా అక్కినేని కుటుంబ ‘మనం’ కథలా మారి ఘట్టమనేని ఫ్యామిలీ మూవీ కాబోతోందని టాక్. 


మూవీ కథ అంతా విశాఖపట్నం నేపధ్యంలో జరగడమే కాకుండా ఈ మూవీ కథ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మహేష్ డాన్ జీవితంలో వచ్చే సీన్స్ లో అతడి భార్యగా నమ్రత శిరోద్కర్ వారి పిల్లలుగా గౌతమ్ సితార లు నటించబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ మూవీలో డాన్ పాత్రలో నటిస్తున్న మహేష్ తాత పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించే విషయంలో కూడ మహేష్ బాబు ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 


అమెరికాలో కూర్చుని ఇప్పుడు మహేష్ ఘట్టమనేని ‘మనం’ కు లైన్ క్లియర్ చేసాడు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ మూవీలో మహేష్ పోషిస్తున్న ప్రొఫిసర్ పాత్రకు జతగా కియారా అద్వానీ ని ఫిక్స్ చేసారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు మరియు తన మనవలతో కలిసి నటించాలి అన్న డ్రీమ్ ఈ సంవత్సరం తీరబోతోంది అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: