తమిళనాట స్టార్ హీరోగా ఒక్క వెలుగు వెలిగిపోతున్న హీరో అజిత్ కుమార్. తెలుగు లో ప్రేమపుస్తకం సినిమాతో కెరీర్ ఆరంభించిన అజిత్ తర్వాత కోలీవుడ్ లోకి వెళ్లిపోయాడు. అక్కడే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తమిళనాట రజినీకాంత్ తర్వాత స్టార్ హీరోలుగా మంచి ఫామ్ లో ఉన్నది అజిత్, విజయ్, సూర్య అనిచెప్పొచ్చు. అయితే అజిత్ తో సినిమా అంటే ఏ దర్శక, నిర్మాతలైనా ఎగిరి గంతేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు తమిళంలో వరుస విజయాలు సొంతం చేసుకున్న కె.ఎస్ రవికుమార్, ఆ తర్వాత పరాజయాల బాట పట్టారు. తమిళంలో స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆలోచనలో పడుతున్న సమయంలో అయన దృష్టి తెలుగు ప్రరిశ్రమపై పెట్టి, బాలకృష్ణతో జై సింహ, రూలర్ సినిమాలను తెరకెక్కించాడు. జై సింహ పరవాలేదు అనిపించింది.. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.
దాంతో మరోసారి బాలయ్యతో రూలర్ భారీ పెట్టుబడితో నిర్మించారు.. కానీ ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. దాంతో మళ్లీ కేఎస్ రవికుమార్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఇదే సమయానికి కేఎస్ రవికుమార్ కి హీరో అజిత్ ఓ ఛాన్స్ ఇచ్చారని.. ఆ విషయం స్వయంగా రవికుమార్ తెలిపినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో విలన్ సినిమా వచ్చింది. అప్పట్లో అది సూపర్ హిట్. అజిత్ స్థాయిని పెంచింది.. ఆ కృతజ్ఞతతో రవికుమార్ కి ఓ ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 30 శాతం చిత్రీకరణ కూడా పూర్తయిందని, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో దీనిని నిర్మిస్తోందన్నది వార్తలు వచ్చాయి. తాజాగా తన పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్గా తేలింది.దీనిపై కేఎస్ రవికుమార్ స్పందిస్తూ నా పేరుతో ఎలాంటి ట్వి టర్ అకౌంట్ లేదు. నకిలీ అకౌంట్ ద్వారా ఎవరో అలా ప్రచారం చేశారని.. ఆ విషయాలను ఎవరూ నమ్మకండి. ప్రస్తుతం అజిత్తో సినిమా చేయడం లేదని’ స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రచారాలకు చెక్ పడింది.