ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న నటి షకీలా.  మాలీవుడ్ లో ఆమె సినిమాలు వస్తున్నాయంటే స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసుకునే వారట.  ఈమె సినిమాల్లో అశ్లీలత లేకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్.. శృంగారం డోసు కాస్త ఎక్కువ ఉండేదట.. దాంతో యూత్ పిచ్చెక్కిపోయావారని అప్పట్లో టాక్ వినిపించేది. కొంత కాలం తర్వాత ఈ శృంగార తార డిమాండ్ తగ్గిపోయింది.  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో నటించింది షకీలా.  అప్పట్లో షకీలా పేరు వినిపిస్తే చాలా థియేటర్ల వద్ద క్యూలు పెరిగిపోయేవని అంటారు.  అయితే షకీలా సినీ జీవితం ఎలా ఉన్నా ఆమె పర్సనల్ జీవితం మాత్రం ఎన్నో కన్నీళ్లు.. కష్టాలే అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.  

 

షకీలా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షకీలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది... ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ ని గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతం అయ్యింది.  ప్రముఖ నటి షకీలా, కమెడియన్ వేణుమాధవ్ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు.  తాను వేణుమాధవ్ ని ఒక సొంత తమ్ముడిగా భావించేదానిని.. అతడు మరణించాడని వార్త తెలియగానే గుండె తట్టుకోలేక పోయిందని అన్నారు. తెలుగు సిని పరిశ్రమలో తను ముగ్గురితో మాత్రమే క్లోజ్ గా ఉంటానని.. వారిలో అలీ అన్న ఒకరని చెప్పింది.

 

ఎప్పుడైనా సినిమాల కోసం ఫోన్ చేసి మాట్లాడుతుంటానని.. మరో వ్యక్తి గీతాంజలి అనే నటి అని చెప్పారు.  ఇక కమెడియన్ వేణు తో ఎంతో సన్నిహిత సంబంధం ఉండేదని.. అక్కా తిన్నావా అంటూ ఫోన్ చేసి అడిగే ఏకైక వ్యక్తి వాడేనని చెప్పారు.  అలాంటి వ్యక్తి ఇప్పుడు లేడని.... వాడే బతికి లేనప్పుడు ఇక నేను వాడి కుటుంబంతో ఎలా మాట్లాడతాను అంటూ ఎమోషనల్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: