సాధారణంగా ఏ సినిమా అయినా మంచి రోజు ముఖ్యంగా శుక్రవారం డేట్ న రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఇక టాలీవుడ్ లో కొంత మంది హీరోలకు అలాండి డేట్స్ అంటేనే ప్రాధాన్యత ఇస్తారు.. సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయిన తాము అనుకున్న డేట్ కే ఫిక్స్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు.  మరికొంత మంది సినీ తారలు పండుగ సందర్భంగా లేదా ఏదైనా ప్రత్యేక తేదీల్లో సినిమాలు రిలీజ్ అయ్యేలా చూస్తుంటారు. గత కొంత కాలంగా ఈ రకమైన ట్రెండ్ కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న నాలుగు సినిమాలు మాత్రం ఇందుకు విరుద్దంగా ఒకే తేదీపై కన్ను వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 

ప్రస్తుతం రానా దగ్గుబాటి నటిస్తున్న ‘అరణ్య’, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ, అనుష్క నటిస్తున్న ‘నిశ్శబ్దం’, ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన ఈ నాలుగు మూవీలు ఏప్రిల్ 2 న రిలీజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. విచిత్రం ఏంటేంటే అప్పటికే ఉగాది పండుగ పూర్తి అవుతుంది. పిల్లల ఎగ్జామ్స్ కూడా అదే సమయంలో జరుగుతుంటాయి.  అయితే మూవీ మేకర్స్ మాత్రం ఏప్రిల్ 2 పైనే కన్ను వేశారు. అయితే వేసవి సెలవలు అప్పుడే మొదలు అవుతుంటాయి.

 

ఇదే సమయంలో మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్దం అవుతుంటాయి. అందుకే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. అందుకే శుక్రవారం కాకుండా ఆ డేట్ గురువారం పడినా.. సినిమాలన్నీ విడుదలకు ఎగబడుతున్నాయి. కాగా,  ప్రస్తుతానికి లిస్ట్ లో ఉన్న సినిమాల నుండి 'ఉప్పెన', 'నిశ్శబ్ధం', 'అరణ్య' సినిమాల నుండి రిలీజ్ డేట్ పోస్టర్లు వచ్చేశాయి. 'లవ్ స్టోరీ' పోస్టర్ కూడా త్వరలోనే వస్తుందని అంటున్నారు. మరిఈ సినిమాల పోటీ ఎలా ఉంటుందో రిజల్ట్ ని బట్టే తెలిసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: