టాలీవుడ్ లో వారసత్వపు హీరోలుగా వచ్చిన వారి లో అక్కినే ఫ్యామిలీకి చెందిన హీరో నాగార్జున తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు ఉన్నారు.  పదేళ్ల క్రితం జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యడు నాగ చైతన్య.  అయితే ఈ మూవీ అంతగా పేరు తీసుకు రాలేదు.  ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటించిన ‘ఏం మాయ చేసావే’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు నాగ చైతన్య.  ఈ మూవీతో పరిచయం అయిన సమంతను రియల్ లైఫ్ లో కూడా ప్రేమించాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో ఆటోనగర్ సూర్య, మనం సినిమాలు వచ్చాయి.  ఆ తర్వాత సమంతను పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య.   వీరిద్దరు కలిసి ‘మజిలీ ’ సినిమాలో నటించి మంచి విజయం అందుకున్నారు.

 

శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చైతు కమర్షియల్ హీరో అనిపించుకుని తనకంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు.  గత ఏడాది మజిలీ హిట్ తర్వాత తన సొంత మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన ‘వెంకిమామ’ కూడా మంచి హిట్ అందుకున్నాడు. అయితే నాగ చైతన్య నటించిన మజిలీ సినిమా   బాక్సా ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. ఆ తర్వాత వెంకిమామ కూడా ఓపెనింగ్స్ ని గట్టిగానే ఉంది. దీంతో తన రెమ్యునరేషన్ ని చైతు 8కోట్లకు పెంచినట్టు తెలుస్తోంది. ఓ విధంగా నాగార్జున కంటే ఇది పెద్ద నెంబర్ అని చెప్పవచ్చు.  

 

నాగ్ సినిమా బడ్జెట్ ని బట్టి 7కోట్లకు మించడు. మొత్తానికి ఈ విషయంలో చైతూ తండ్రిని మించిన తనయుడు అయ్యాడని టాలీవుడ్ టాక్.  పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం చైతు ఈ రేంజ్ లో డిమాండ్ చేశాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ ‘లవర్ బాయ్’మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత పరుశరామ్ తో నటించబోతున్నాడట.  14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లో ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: