ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. టోటల్ సౌత్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. గత సంవత్సరం మజిలీ, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్స్ ని అందుకుంది. దాంతో హ్యాట్రిక్ సినిమాకోసం చాలా కథలు విని చివరకి జాను సినిమా కమిటయింది. వాస్తవంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఏ హీరోయిన్ అయినా చేస్తుంది కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అందరి వల్ల కాదు. అలా ఆడియన్సును థియేటర్లకు రప్పించగల కెపాసిటి, క్రేజ్ సమంతకే సొంతం. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిపోయిందా అనే కొత్త అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. 

 

సమంత నటించిన 'యు టర్న్'.. 'ఓ బేబీ' సినిమాల రిలీజ్ కు ముందు మంచి బజ్ కనిపించింది. అయితే 'యు టర్న్' ఫ్లాపవగా 'ఓ బేబీ' మంచి హిట్ ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో సమంత క్రేజ్ పీక్స్ లో కనిపించింది. ఇక 'మజిలీ' లో హీరో నాగచైతన్య అయినప్పటికి సమంత తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయింది. ఈ సినిమాలకు కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. అయితే సమంత కొత్త సినిమా 'జాను' విషయానికి వచ్చేసరికి ఆ మ్యాజిక్ అసలు పనిచెయ్యలేదు. సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్లు కూడా ఆకట్టుకునే విధంగా రాలేదు. ఇక శర్వానంద్ కూడా ఫ్లాపుల్లో ఉండడంతో ఈ సినిమాకు క్రేజ్ తీసుకురాలేకపోయాడు. ఏదేమైనా 'జాను' మాత్రం ఫ్లాప్ అన్న మాట వినిపిస్తోంది.

 

అయితే ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే సమంత క్రేజ్ కూడా తగ్గిపోయిందేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో 'జాను' వల్లే సమంత క్రేజ్ దెబ్బతిన్నదని కూడా రివర్స్ లో కామెంట్ చేస్తున్నారు. సమంతరీమేక్ లో చెయ్యను అని తప్పించుకున్నప్పటికీ నిర్మాత దిల్ రాజు పట్టుబట్టి మరీ చేయించారని చెప్పుకుంటునారు. ఏదేమైనా సమంత క్రేజ్ మొత్తం ఒక్కసారిగా పడిపోయిందంటే అది కేవలం జాను సినిమా వల్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: