క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి అందరికీ తెలిసిందే. ఫిల్మ్ నగర్ కి ఎక్కడో దూరంగా సికిందరాబాద్ పద్మారావు నగర్ లో ఉంటూ అక్కడే తన సినిమా ఆఫీసుని పెట్టుకొని బయట నిర్మాతల కోసం ఎదురు చూడకుండా తన పాటికి తను సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీంస్ ఎంతగా ఎవరీకీ తెలియకపోయినప్పటికి ఆ తర్వాత వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ సినిమాలతో టాలీవుడ్ లో సంచలనం సృష్ఠించారు. ఆయన ఏ నిర్మాతని కలిసినా ఆ నిర్మాత మంచి కాఫీలాంటి సినిమా కావాలని అడగడం విశేషం. అంతేకాదు స్వర్గీయులు శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి శేఖర్ కమ్ముల సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే రెమ్యూనరేషన్ కూడా అడగకుండా గోదావరి సినిమాలో చక్కటి పాట రాసిచ్చారు. అంతటి గౌరవాన్ని శేఖర్ కమ్ముల అతి తక్కువకాలంలోనే సంపాదించుకున్నారు.

 

ఇక ఆయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాయిపల్లవి లతో తెరకెక్కించిన ఫిదా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. వరుణ్ త్ప పాటు సాయి పల్లవి కి మంచి హిట్ ని అందించింది. ఇక ముందు నుంచి శేఖర్ కమ్ముల ఎక్కువగా కొత్తవాళ్ళనే వెండి తెరకి పరిచయం చేయడం ఒక గొప్ప విషయమని చెప్పాలి. ఆ కోవలోనే కమిలినీ ముఖర్జీ, వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్దార్థ్, బిందు మాధవి, ప్రియా ఆనంద్, రీచా గంగోపాధ్యాయ వంటి కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయమై కొనసాగుతున్నారు. ఇక తమన్నా కూడా హ్యాపీ డేస్ సినిమాతో బాగా ఫేమస్ అయింది. ఆ సినిమా తమన్నా మంచి బ్రేక్ ఇచ్చింది.

 

అయితే ఇంతమంది కొత్తవాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన శేఖర్ కమ్ముల తనకి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదని నానా రచ్చ చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్ లో చాలామందిని టార్గెట్ చేసిన సంచనలన నటి శ్రీ రెడ్డి శేఖర్ కమ్ముల ని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు మరీ హద్దుమీరి పోయాయి. ఒక దర్శకుడిని పట్టుకొని సన్నగా చీపురు పుల్లలా ఉన్నావ్ ..గట్టిగా ఊదితే ఎగిరిపోతావ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు విన్న శేఖర్ కమ్ముల రియాక్ట్ కానప్పటికి ఆయన సన్నిహితులు మాత్రం శ్రీరెడ్డిని ఆయన ఎలా ఉంటాడో తెలుసు కదా ఊదితే ఎగిరిపోయో వాళ్ళ ఆఫీస్ కొచ్చి ఛాన్స్ ఇమ్మని అడగలేదా ..క్యారెక్టర్ కి సెట్ అవలేదని ఛాన్స్ ఇవ్వకపోతే ఇలా దిగజారి మాట్లాడతారా అంటూ సమాధానమిచ్చారట. ఏదేమైనా ఇలాంటి పరిణామాలు ఇండస్ట్రీకి మంచిది కావన్న మాట వినిపిస్తున్నప్పటికి అది పూర్తిగా సమసిపోయోదెప్పుడో ఎమో.

 

ఇక శేఖర్ కమ్ముల తాజాగా అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రిలీజైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని అంచనాలను భారీగా పేంచేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: