యాంకర్ అనసూయ కొన్ని విషయాల్లో ఎంత నిక్కచ్చిగా ఉంటారో అందరికీ తెలిసిందే. సమాజంలో ఎటువంటి అన్యాయం జరిగినా.... అది కాకుండా ఆడవారికి విధంగానైనా అయినా తలవంపులు తెచ్చే పని ఎవరు చేసినా వారి అంతు చూసే దాకా వదిలిపెట్టదు. ప్రస్తుతం అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

 

సాధారణంగా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో కొంతమంది కీచకులు అసభ్యకరమైన పేజీలు క్రియేట్ చేసి అందులో హీరోయిన్ బొమ్మలు మార్ఫింగ్ చేసి లేదా వారి హాట్ ఇమేజ్ లను పెట్టి అసభ్యకరమైన కథలు అల్లడం లేదా వారిపై లేనిపోని నిందలతో పోస్టులు వేయడం వంటివి అప్పుడో ఇప్పుడో చూసే ఉంటాం. అలాంటి ఒక పేజీ వారి ఖర్మ కాలి మన యాంకర్ అనసూయ కంటపడింది. అందులో అనసూయను అసలు ఆమోదయోగ్యం కాని రీతిలో మరియు అతి నీచమైన అసభ్యకర పదజాలంతో వారు ధూషించారు.

 

దీనితో పోస్టును అనసూయ స్క్రీన్ షాట్ తీసి ముందుగా ట్విట్టర్ వారికి పేజీని బ్లాక్ చేయమని రిపోర్టు చేసింది. అందులో ఆమె ఫోటో కిందనే నాగార్జున మరియు అనుష్క గురించి కూడా వారు చాలా తప్పుగా రాశారు. ఏదో నాగార్జున మరియు అనుష్క కు అగ్రిమెంట్ ఉన్నట్లు ఫార్మ్ హౌస్ లో అలా.... ఇలా.... అంటూ చాలా నీచమైన కథను వారు అల్లగా దానిని కూడా అనసూయ రిపోర్టు చేసినట్టయింది. ఆమెతో పాటు అనుష్క మరియు నాగార్జున లాంటి సెలబ్రిటీలపై అలాంటి నీచమైన కామెంట్స్ చేయడం చాలా పెద్ద తప్పు.

 

Dear @TwitterSupport .. I urge you to reassess "your rules" .. if this is not violating then what else does.. I won't shy away to blame you guys as major influence by not contemplating the cyber abuse.. @cybercrimecyb1 Sir I request you to help tag the right authorities 🙏 pic.twitter.com/G4I3KRwFQ9

anasuya Bharadwaj (@anusuyakhasba) February 9, 2020

 

కానీ ఆమెను షాక్ కు గురి చేస్తూ పెట్టేవారు తమ నిబంధనలను అది ఏమి ఉల్లంఘించలేదు అంటూ సెలవిచ్చారు. దీనితో విస్తుపోయిన అనసూయ ట్విట్టర్ వారిని వారి రూల్స్ ను త్వరగా ఒకసారి సమీక్షించుకోమని చెప్పి హైదరాబాద్ పోలీస్ వారి ట్విట్టర్ అకౌంట్ ను ఆశ్రయించింది. పోలీసు వారు తాము ఖచ్చితంగా విషయాన్ని పరిగణిస్తామని మరియు నేరస్థులను పట్టుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: