రామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్య చిన్న సున్నితమైన గ్యాప్ ఉంది అంటూ అనేకసార్లు గాసిప్పులు వచ్చినా వారిద్దరు తమ మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అంటూ అనేకసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే వీరిద్దరి సాన్నిహిత్య బాంధవ్యాన్ని పక్కకు పెట్టి ఎదో ఒక న్యూస్ వీరిద్దరి మధ్య గ్యాప్ ఉంది అంటూ అనిపించే విధంగా ఇండస్ట్రీలో హడావిడి చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.


ఇప్పుడు లేటెస్ట్ గా గతవారం విడుదలైన ‘జాను’ మళ్ళీ చరణ్ బన్నీల మధ్య చిచ్చు పెట్టి మెగా అభిమానులు బన్నీ అభిమానులు ఒకరి పై ఒకరు కామెంట్స్ చేసుకునే స్థాయికి చేరుకొని అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మధ్య చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికా యూరప్ దేశాలలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసి భాగ్యనగరం తిరిగి వచ్చి ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో చాల సీరియస్ గా పాల్గొంటున్నాడు.


చరణ్ ఇంత బిజీలో కూడ ‘జాను’ మూవీని చూడటమే కాకుండా ఆ మూవీ పై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్ చేసాడు. అంతేకాదు ఈ మూవీలో నటించిన శర్వానంద్ సమంతల అద్భుత నటనను ప్రశంసిస్తూ ఈ మూవీ ఒక అద్భుతమైన సినిమా అంటూ తన అభిప్రాయాలను తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

 

ఇప్పుడు ఈ విషయం చరణ్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ మూవీని ఇప్పటి వరకు చూడటానికి తీరికలేని చరణ్ కు ‘జాను’ సినిమాను చూడటానికి సమయం చిక్కిందా అంటూ బన్నీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య ‘అల’ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు చరణ్ ఈ సినిమాను చూసాడా ? అని ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు బన్నీ సమాదానం ఇస్తూ చరణ్ విదేశాలలో ఉండటం వల్ల తన సినిమాను చూడలేకపోయాడు అంటూ అప్పట్లో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు చరణ్ విదేశాల నుండి తిరిగి వచ్చి ముందుగా ‘అల’ సినిమా చూసి తన అభిప్రాయం చెప్పకుండా ‘జాను’ మూవీని చూడటమే కాకుండా ఆ మూవీని విపరీతంగా ప్రశంసించడం అల్లు అర్జున్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: