తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు కామెడీ దర్శకులుగా జంద్యాల తర్వాత వివివి సత్యనారాయణ, రేలంగి నరసింహారావు లు ఎంతో మంచి కామెడీ చిత్రాలు అందించారు.  ఇప్పటికీ వీరు తీసిన చిత్రాలు థియేటర్లో, టీవిల్లో వస్తుంటే కడుపుబ్బా నవ్వుకుంటుంటారు.  ఆ తర్వాత ఈ తరం కామెడీ దర్శకుల్లో ఒకరు మారుతి, అనీల్ రావిపూడి అని చెప్పొచ్చు.  ఈ ఇద్దరు దర్శకులు తీసే కామెడీ తరహా చిత్రాలు మంచి ఉల్లాసాన్ని ఇస్తున్నాయి.  థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు మనసారా నవ్వుకుంటున్నారు.  ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 తర్వాత ఈ ఏడాది సంక్రాంతికానుకగా రిలీజ్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

 

ఈ చిత్రంలో మహేష్ బాబును ప్రత్యకంగా చూపించడమే కాకుండా పదమూడేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతిని రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు అనీల్ రావిపూడి.  రెండు సంక్రాంతులకు భారీ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు మూడో సంక్రాతి టార్గెట్ గా కొత్త  చిత్రం మొదలెట్టబోతున్నాడట. అయితే అనీల్ రావిపూడికి సంక్రాంతి మంచి సెంటిమెంట్ లా అనిపిస్తుంది.  గత సంక్రాంతి ఎఫ్ 2, ఈ సంక్రాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చే సంక్రాంతికి ఎఫ్ 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

అందులో భాగంగానే 'ఎఫ్ - 3' స్క్రిప్ట్ మీద కూర్చున్నట్టుగా చెబుతున్నారు. 'ఎఫ్ - 3' లో వరుణ్ - వెంకటేష్ కాకుండా మరో హీరో ని కూడా యాడ్ చేస్తున్నాడట.  గతంలో రాజా ది గ్రేట్ మూవీతో మంచి విజయం అందుకున్న రవితేజను ఎఫ్3 లో తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ.. ఈలోపు వెంకటేష్ ఎఫ్ 3 కి పారితోషకం భారీగా డిమాండ్ చేస్తున్నట్లు  ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మరోసారి అనీల్ రావిపూడి పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: