వరస పరాజయాలతో సతమతమైన  నాగ చైతన్య ను మజిలీ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. గత ఏడాది సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం చైతన్య  కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించగా షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మించింది. ఇక ఈ చిత్రాన్ని తాజాగా హిందీ లోకి డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదలచేశారు.  అయితే అలా విడుదలైందో లేదో హిందీ వెర్షన్ కేవలం నాలుగు రోజుల్లోనే 20మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది. 
 
ఇదిలావుంటే నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ లో నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నాగ చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు వున్నాయి. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా అదరగొడుతుంది ఈ చిత్రం. అందులో భాగంగా లవ్ స్టోరీ ఓవర్సీస్ హక్కులు 5.5కోట్లకు అమ్ముడయ్యాయి. ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈసినిమా తరువాత  నాగ చైతన్య  తన  కొత్త సినిమాకు  ఇంకా సైన్ చేయలేదు. కాగా సాయి పల్లవి మాత్రం ఈసినిమాతో పాటు  వేణు ఊడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం లో నటిస్తుంది. ఈసినిమా తరువాత ఆమె ,నేచురల్ స్టార్ నాని తో మరోసారి జోడికట్టనుందని టాక్. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: