యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో ప్లాప్ త‌ర్వాత జాన్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జిల్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమా వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక బాహుబ‌లి సినిమాల‌కు వ‌చ్చిన క్రేజ్‌తో ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. ఈ సినిమాల‌తో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత అదే క్రేజ్‌తో సాహో లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించాడు.

 

ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఏకంగా రు.300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. అయితే ఎంచుకున్న క‌థ‌, క‌థ‌నాల నేప‌థ్యంలో సాహో జ‌నాల‌కు ఎక్క‌లేదు. ఒక్క హిందీలో త‌ప్ప సాహో అన్ని భాష‌ల్లోనూ ప్లాప్ అయ్యింది. ఒక్క హిందీలో మాత్ర‌మే సాహో రు. 150 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక సాహో తెలుగులో చాలా వ‌ర‌కు క‌నెక్ట్ కాక‌పోవ‌డానికి ఆ సినిమాలో చేసిన వాళ్లంతా నార్త్ ఇండియ‌న్ న‌టులే.

 

అది సాహోకు పెద్ద మైన‌స్ అయ్యింది. ఇప్పుడు ప్ర‌భాస్ జాన్ విష‌యంలో నూ కూడా అదే పొర‌పాటు రిపీట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే జాన్ లో బాలీవుడ్ న‌టులు సీనియ‌ర్లు అయిన మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, భాగ్య‌శ్రీ న‌టిస్తున్నారు. మిథున్ సీనియ‌ర్ న‌టుడు. ఇక ప్రేమ పావురాలు సినిమాతో దేశాన్ని ఊపేసిన భాగ్య శ్రీ కూడా ఈ సినిమాలో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే జాన్ సినిమాలో విల‌న్ల‌తో పాటు మ‌రో కీల‌క పాత్ర‌కు సైతం మ‌రో సీనియ‌ర్ బాలీవుడ్ న‌టుడుని తీసుకోబోతున్న‌ట్టు టాక్‌.

 

ఏదేమైనా సాహో సినిమాతో ఏదైతే ప్ర‌భాస్ పొర‌పాటు చేశాడో... ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే రిపీట్ చేస్తున్న‌ట్టు ఉంది. మ‌రి జాన్ సినిమా కూడా ఏదైనా తేడా కొడితే తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌డం క‌ష్టం అవుతుంది. మ‌రి ఈ విష‌యంలో ప్ర‌భాస్ పున‌రాలోచ‌న చేస్తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: