తమిళ యంగ్ హీరో కార్తి నటించిన ఖైదీ గత ఏడాది దీపావళి సమయం లో విడుదలై ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. పాటలు ,హీరోయిన్ వంటి కమర్షియల్ అంశాలను దూరం పెట్టి రియలిస్టిక్ గా కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. అంతేకాదు తమిళ్ లో ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుగులోనూ ఖైదీ కి అంతే  రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు  హిందీలోకి వెళ్లనుంది. 
 
ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన  డ్రీం వారియర్ పిక్చర్స్  తో కలిసి రిలయన్స్ ఎంటర్ టైమెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటులను , సాంకేతిక నిపుణలను ఫైనల్ చేసే పనిలో వున్నారు.  అందులో భాగంగా  ఈచిత్రంలో  బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ను హీరోగా నటించాలని కోరారట నిర్మాతలు అయితే హృతిక్ కూడా అందుకు సుముఖంగానే వున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ రానుంది.
 
ఇక  ఈ రీమేక్ ను కూడా లోకేష్ కనకరాజే డైరెక్ట్  చేస్తాడని టాక్ వస్తుంది.  అయితే లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరో, దళపతి విజయ్ తో మాస్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కార్తితో ఖైదీకి సీక్వెల్ చేయనున్నాడు  అలాగే ఈ సినిమాతోపాటు ప్రముఖ హీరో కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషల్ సంస్థ లో కూడా ఓ సినిమా చేయాల్సి వుంది. మరి ఇన్ని కమింట్ మెంట్ల మధ్య హిందీ ఖైదీ ని తెరకెక్కించడానికి లోకేష్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: