ఈ మద్య తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ పై ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. విజయ్ ఆఫీస్ లపై ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 70కోట్లరూపాయలు స్వాధీనం చేసుకున్నారు.  విజయ్ పై ఐటీ అధికారులు దాడులు జరపడం తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విజయ్ పై జరిగిన ఐటీ దాడుల వ్యవహారం పొలిటికల్ హీట్ ని కూడా పెంచుతోంది.  గతంలో ఆయన నటించిన మెర్సిల్ తెలుగు లో అదిరిందిగా రిలీజ్ చేశారు.  ఈ మూవీలో జీఎస్టీ, వైద్యులపై వ్యతిరేక డైలాగ్స్ ఉన్నాయని.. పెద్ద ఎత్తున గొడవలు జరిగిన విషయం తెలిసిందే.  

 

అదే కాకుండా 'బిగిల్' ఆడియో ఫంక్షన్లోనూ రాజకీయ నాయకులను టార్గెట్ చేసి విజయ్ మాట్లాడటంతో బిజెపి క్షక పెంచుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ ఫ్యాన్స్, బిజెపి కార్యకర్తల మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఐటీ దాడులు జరిగిన అనంతరం బిజెపి కార్యకర్తలు విజయ మాస్టర్ చిత్ర షూటింగ్ ని అడ్డుకోవాలని ప్రయత్నించడం, విజయ్ అభిమానులు ప్రతిఘటించడం జరిగింది. ఈ విషయం దేశ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఆర్య, రమేష్ ఖన్నా లాంటి సినీ ప్రముఖుల్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. హీరో విజయ్ వద్ద నల్లధనం, మత మార్పిడులే ఐటి దాడులకు ప్రధాన కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

విజయ్‌పై జరిగిన ఐటీ సోదాల వెనక అసలు నిజాలు' అంటూ ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్స్ ను పోస్ట్ చేస్తూ సేతుపతి ఓ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ  పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాగా విజయ్ నటిస్తున్న తాజా మూవీ మాస్టర్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై ఎంత మంది హీరోలు, నటులు స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: