ఇటీవల మనం 2020 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరువాత వచ్చిన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ లో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందులో సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ డిస్కో రాజా ఫ్లాప్ గా నిలవగా, మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను సినిమా పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతోంది. 

 

ఇక రెండు రోజుల్లో విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ తో పాటు మరొక వారం రోజుల్లో నితిన్ భీష్మ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిజానికి అటు విజయ్, ఇటు నితిన్ ఇద్దరి కెరీర్ పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగానే ఉంది. ఇద్దరూ కూడా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నలుగురు హీరోయిన్లతో వరల్డ్ ఫేమస్ లవర్ గా విజయ్ మన ముందుకు వస్తుంటే, భీష్మ అనే పేరుతో డిఫరెంట్ స్టోరీ తో నితిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

 

వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు విజయ్ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఈ రెండు సినిమాల ఆడియో లకు శ్రోతల నుండి మంచి స్పందన రావడం జరిగింది. ఒకరకంగా రెండు సినిమాల మధ్య వారం గ్యాప్ ఉన్నప్పటికీ, రెండిట్లో ఏది హిట్ అయితే, వారికి మంచి కలెక్షన్ సంపాదించే స్కోప్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు ఎంతమేర తమ ప్రస్తుత సినిమాలతో విజయాలు అందుకుంటారో చూడాలి..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: