అక్కినేని వారి కుటుంబం అందరూ కలిసి నటించిన సినిమా మనం..ఈ సినిమాలో అక్కినేని కుటుంబం మొత్తం సినిమాలో కనిపించేలా సినిమాను ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే..ఆ సినిమా తరహాలో ఇప్పుడు . మహేష్ కుటుంబం కూడా అదే తరహాలో సినిమా చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి..ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మనం’ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, చివర్లో అఖిల్ ఈ సినిమాలో ఒకే స్క్రీన్‌లోకనిపించి అభిమానులకు కనువిందు చేసారు.  

 

ముందుగా అనుకోకపోయినా.. అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ చిత్రంలో అక్కినేని హీరోలతో కలిసి నటించిడం యాదృచ్చికమనే చెప్పాలి. ముందుగా అనుకోకపోయినా.. అక్కినేని వాళ్లింటి కోడలైన సమంత కూడా ‘మనం’ చిత్రంలో అక్కినేని హీరోలతో కలిసి నటించిడం యాదృచ్చికమనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత మోహన్ బాబుకు చెందిన మంచు ఫ్యామిలీ హీరోలు మనోజ్, విష్ణులు కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ అనే చిత్రంలో కలిసి నటించారు. 

 

 

టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార అందరు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్‌గా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు..

 

 

 వంశీ సినిమాలో అటు తండ్రి కృష్ణ, ఇటు భార్య నమ్రత కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి ఫిల్మ్ సర్కిల్స్‌లో వినపడుతున్నట్టు ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలందరు ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఒకే వేళ నటిస్తే.. తెలుగులో ఒకే సినిమాలో కలిసి నటించిన మూడు తరాల హీరోలుగా ఘట్టమనేని మిగిలిపోనుంది. హిందీలో మాత్రం కపూర్ ఫ్యామిలీ హీరోలు పృథ్వీ రాజ్ కపూర్, రాజ్ కపూర్,రణ్‌దీర్ కపూర్‌లు ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలో మూడు తరాలు కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా....ఈ సినిమాలో వీరందరూ నటించడం పై మహేష్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: