తెలుగు
సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు వచ్చిన ఎందరో దర్శకుల్లో కొందరు మంచి పేరు గడించి అత్యున్నత స్థాయిలో ఉన్న వారున్నారు. అయితే అటువంటి వారిలో నేటి తరంలోని
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు అనే చెప్పాలి. మొదట కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన
త్రివిక్రమ్, తన పదునైన పంచ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత
తరుణ్,
శ్రీయ ల కలయికలో వచ్చిన నువ్వే నువ్వే అనే సినిమాతో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టిన
త్రివిక్రమ్, ఫస్ట్
మూవీ తోనే మంచి హిట్ అందుకున్నాడు.
దాదాపుగా ఆ సినిమాలోని చాలా అంశాలతో పాటు మెయిన్ థీమ్ ని
త్రివిక్రమ్ తన అజ్ఞాతవాసిలో వాడుకోవడం జరిగిందని విపరీతంగా ఆయనపై విమర్శలు వచ్చాయి. అదీకాక లార్గో వించ్ దర్శకుడు ఏకంగా
టాలీవుడ్ మూవీ అజ్ఞాతవాసి తమ సినిమాకు కాపీ అంటూ తన సోషల్
మీడియా అకౌంట్స్ లో ఒక ట్వీట్ కూడా వేయడంతో అప్పటివరకు
త్రివిక్రమ్ పై ఉన్న పాజిటివ్ ఇమేజ్ పై ఒక్కసారిగా పెద్ద మచ్చ పడింది. ఇక ఆ తరువాత
ఎన్టీఆర్ తో
అరవింద సమేత, ఇటీవల బన్నీతో
అలవైకుంఠపురములో సినిమాలు తీసి త్రివిక్రమ్ హిట్ కొట్టినప్పటికీ, ఆయనపై ఆ మచ్చ తాలూకు మరకలు మాత్రం తొలిగిపోవడం లేదు. ఇక ఇప్పటికీ కూడా, ఎంత హిట్స్ కొడితే మాత్రం ఏమి లాభం, ఆ ఒక్క పనితో ఆయన ఛీ అనిపించుకున్నారుగా అంటూ ఆయనపై ఇంకా విమర్శలు ఎక్కుపెడుతున్నవారున్నారు... !!