తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు వచ్చిన ఎందరో దర్శకుల్లో కొందరు మంచి పేరు గడించి అత్యున్నత స్థాయిలో ఉన్న వారున్నారు. అయితే అటువంటి వారిలో నేటి తరంలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు అనే చెప్పాలి. మొదట కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్, తన పదునైన పంచ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత తరుణ్, శ్రీయ ల కలయికలో వచ్చిన నువ్వే నువ్వే అనే సినిమాతో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్, ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ అందుకున్నాడు. 
 
 
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో అతడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, ఆపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జులాయి వంటి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, అక్కడి నుండి వరుసగా పలువురు హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఇక రెండేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన తీసిన అజ్ఞాతవాసి సినిమా, యావత్ త్రివిక్రమ్ సినీ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగలడంతో పాటు ఆయనకు కొంత వరకు నెగటివ్ ఇమేజ్ ని కూడా తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ సమయంలో, అది అంతకముందు వచ్చిన లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమాకు ఫ్రీ మేక్ అనే వార్తలు రావడం, ఆ తరువాత ఆ సినిమాని అజ్ఞాతవాసితో కంపేర్ చేయగా, 
 
 
దాదాపుగా ఆ సినిమాలోని చాలా అంశాలతో పాటు మెయిన్ థీమ్ ని త్రివిక్రమ్ తన అజ్ఞాతవాసిలో వాడుకోవడం జరిగిందని విపరీతంగా ఆయనపై విమర్శలు వచ్చాయి. అదీకాక లార్గో వించ్ దర్శకుడు ఏకంగా టాలీవుడ్ మూవీ అజ్ఞాతవాసి తమ సినిమాకు కాపీ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ట్వీట్ కూడా వేయడంతో అప్పటివరకు త్రివిక్రమ్ పై ఉన్న పాజిటివ్ ఇమేజ్ పై ఒక్కసారిగా పెద్ద మచ్చ పడింది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తో అరవింద సమేత, ఇటీవల బన్నీతో అలవైకుంఠపురములో సినిమాలు తీసి త్రివిక్రమ్ హిట్ కొట్టినప్పటికీ, ఆయనపై ఆ మచ్చ తాలూకు మరకలు మాత్రం తొలిగిపోవడం లేదు. ఇక ఇప్పటికీ కూడా, ఎంత హిట్స్ కొడితే మాత్రం ఏమి లాభం, ఆ ఒక్క పనితో ఆయన ఛీ అనిపించుకున్నారుగా అంటూ ఆయనపై ఇంకా విమర్శలు ఎక్కుపెడుతున్నవారున్నారు... !! 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: