‘సైరా’ విడుదల కాకముందు ఆ మూవీ విడుదల తరువాత సురేంద్ర రెడ్డి రాజమౌళి స్థాయికి చేరుకుంటాడ అంటూ ఎన్నోకధనాలు వచ్చాయి. ఈ మూవీ నిర్మాణ సమయంలో చరణ్ సురేంద్ర రెడ్డిల సాన్నిహిత్యం విపరీతంగా పెరిగి పోవడమే కాకుండా చివరకు సురేంద్ర రెడ్డి మెగా ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయాడు.


అయితే ‘సైరా’ విడుదల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘సైరా’ ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప మరెక్కడా కనీసపు విజయం కూడా సాధించాకపోవడంతో ఈ మూవీ వల్ల మెగా ఫ్యామిలీకి సుమారు 40 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి అన్న ప్రచారం  జరిగింది. దీనితో సురేంద్ర రెడ్డి చరణ్ ల మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది అన్న గాసిప్పులు కూడ వచ్చాయి.


ఇలాంటి పరిస్థితులలో సురేంద్ర రెడ్డి మూవీ ప్రాజెక్ట్ లో నటించదానికి ఓకె చేసిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఆ మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చు బాగా పెరిగి పోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అన్న ప్రచారం జరుగుతున్నా దీని వెనుక అసలు కారణం వేరు అని అంటున్నారు.


‘సైరా’ విడుదల తరువాత సురేంద్ర రెడ్డికి రావలసిన పారితోషికం ఇంకా పూర్తిగా అందకపోవడంతో ఈ విషయం పై అనేక సార్లు చరణ్ తో రాయబారాలు చేసిన సురేంద్ర రెడ్డికి ఫలితం దక్కక పోవడంతో చివరకు ఈ విషయం డైరెక్టర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకు వెళ్ళినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వరుణ్ తేజ్ అసహనానికి గురై సురేంద్ర రెడ్డి మూవీ ప్రాజెక్ట్ ను వదులు కున్నాడు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. ఈ విషయమై ఎన్ని వాస్తవాలు అన్న పాయింట్ లో క్లారిటీ లేకపోయినా నిన్న మొన్నటి దాకా మెగా కాంపౌండ్ కు సన్నిహితంగా ఉన్న సురేంద్ర రెడ్డికి మెగా ట్రబుల్స్ మొదలయ్యాయి అంటూ గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: