నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా సూపర్ ఫ్లాప్ తర్వాత బన్నీ తర్వాతి సినిమా చేయడానికి చాలా ఆలోచించాడు. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అవడంతో చాలా జాగ్రత్తగా నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేసుకున్నాడు.  ఆ ప్లానింగ్ లో భాగంగానే త్రివిక్రమ్ తో సినిమాకి ఒప్పుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రమే అల వైకుంఠపురములో. ఈ సినిమా బన్నీ కెరీర్లోనే కాదు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో టాప్ కి వెళ్ళిపోయి నాన్ బాహుబలి రికార్డుని నెలకొల్పింది.

 

 

అయితే ఈ సినిమా చేయడానికి ముందు బన్నీని చాలా మంది దర్శకులు సంప్రదించారు. ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్నాడు కాబట్టి ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉండిందట. ఆ ఆలోచనలో భాగంగానే హిందీలో విజయం సాధించిన  సోనూ కి టీటూ కే స్వీటీ అనే సినిమాను బన్నీ హీరోగా రీమేక్ చేయాలని కూడా భావించి ఆ సినిమా రైట్స్ ని భారీ మొత్తానికి కొన్నారు.

 

 

కానీ అంతలోనే త్రివిక్రమ్ కథతో సిద్ధం అవ్వడం, అది బన్నీకి చెప్పడం, బన్నీ ఒప్పుకోవడం అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. దాంతో ఆ రీమేక్ ని పక్కన పడేయాల్సి వచ్చింది. ఇప్పుడు అల వైకుంఠపురములో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో రీమేక్ జోలికి వెళ్లకపోవడమే మంచిదైంది అని భావిస్తున్నాడట అల్లు అర్జున్. అయితే సోనూ కి టీటూ కే స్వీటీ సినిమాని మంచి ధర ఇచ్చి కొనడంతో ఆ సినిమాని మరో హీరోతో చేయాలని భావిస్తున్నారట.

 

 

బన్నీ వదిలేసిన ఆ సినిమాని మరో మెగా హీరోతో చేయడానికి సిద్ధం అవుతున్నారట. మరి ఆ హీరో ఎవరు అయ్యుంటారనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతానికి అందరు మెగా హీరోలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో ఒకటికి మించి చిత్రాలు ఉన్నాయి. ఒకవేళ చేయాల్సి వస్తే అల్లు శిరీష్ తోనే చేస్తారని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: