ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో బడా నిర్మాత దిల్ రాజు వ్యక్తిగత జీవితం గురించే పెద్ద చర్చ జరుగుతుంది. కొన్నేళ్ల క్రితం దిల్ రాజు సతీమణి అనిత గుండెపోటు తో మరణించింది. అప్పటినుండి ఆ బాధ ను మర్చిపోవడానికి దిల్ రాజు వరసగా సినిమాలను నిర్మిస్తూ ఫుల్ బిజీ అవుతూ వస్తున్నాడు. అయితే  ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా ఎప్పుడు పనిలోనే నిమగ్నవుతుండడంతో అతని బాగోగులు చూసుకోవడానికి దిల్ రాజు కు మళ్ళీపెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని దాంతో దిల్ రాజు రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నాడని  గత కొద్ది రోజులనుండి వార్తలు వస్తున్నాయి. 
 
అయితే ఇవి గాలి వార్తలని కొట్టి పారేశారు కొందరు కానీ ఇందులో నిజం వుంది. దిల్ రాజుకు అత్యంత సన్నిహితులే రెండో పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చారు. కేవలం కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు ఆహ్వానం లేకుండా ఈ పెళ్ళిని దుబాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఇక దిల్ రాజుకు కాబోయే భార్య వయసు 30సంవత్సరాలని, ఆమె  ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేని, పెళ్ళి కానీ మహిళ అని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఈఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురముతో భారీ లాభాలను  ఖాతాలో వేసుకున్న దిల్ రాజు కు ఇటీవల విడుదలైన జాను షాక్ ఇచ్చింది.  
 
ఈ చిత్రం తరువాత దిల్ రాజు  బ్యానర్ నుండి 'వి' అనే సినిమా రానుంది. నాని ,సుధీర్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం ఉగాది 25న విడుదలకానుంది. ఈ సినిమా తోపాటు ప్రస్తుతం దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ ను అలాగే వివి వినాయక్ హీరో గా శీనయ్య అనే సినిమాలను నిర్మిస్తున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: