టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  ఈ సినిమా తర్వాత ఏపిలో ఎన్నికలు రావడం.. జనసేన పార్టీ తరుపు నుంచి అధినేత పవన్ కళ్యాన్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కానీ జనసేన అధినేత ఘోర పరవాభవాన్ని పొందారు.. నిలిచిన రెండు చోట్ల ఓడిపోయారు.  అయితే ప్రజల్లో తమ పట్ల ఎందుకు వ్యతిరేకత వచ్చిందనే విషయంలో తర్జన భర్జన చేసుకున్న జనసేన అధినేత ఇంకా వారి నమ్మకాన్ని మరింత పొందాలని నిర్ణయం తీసుకున్నారు.  అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతునే..  సినిమాల వైపు దృష్టి పెట్టారు పవన్ కళ్యాన్. 

 

ఈ నేపథ్యంలో ఆయన బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన  పింక్ మూవీ రిమేక్ లో నటిస్తున్నారు.  ఈ మూవీ తమిళ్ లో అజిత్ నటించారు.  ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది.  అయితే ఈ మూవీతో పాటు ప్రముఖ దర్శకులు క్రిష్ తో మరో సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాన్.  ఇందుకోసం హీరోయిన్ ని విషయంలో పలువురిని సంప్రదించారట.  పూజా హెగ్డే ని సంప్రదిస్తే ఆమె నో చెప్పినట్లు సమాచారం. దాంతో  'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో నిధి అగర్వాల్ ని తీసుకునే యోచనలో ఉన్నారట.

 

అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి విజయం అందుకుంది. తాజాగా పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆంగ్లేయులను దోచుకునే ఒక బందిపోటుగా పవన్ కనిపించనున్నాడు. ఈ మూవీలో ఇప్పటికే పూజా హేగ్డే, సోనాక్షీ సిన్హాను సంప్రదించగా డేట్స్ విషయంలో ఇబ్బంది కారణంగా వారు పక్కు తప్పుకున్నారట. ఈ నేపథ్యంలోనే  నిధి అగర్వాల్ ను తీసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: