దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. బాహుబలి2 లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. 
 
రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఇద్దరు మన్యం వీరుల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ బయటకు వాచ్చింది. రాజమౌళి జూనియర్ ఎన్టీయార్ రామ్ చరణ్ మధ్య అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించాడని ఈ ఫైట్ లో రామ్ చరణ్ ఎన్టీయార్ ను చితక్కొడతాడని తెలుస్తోంది. 
 
దాదాపు పది రోజుల పాటు రాజమౌళి ఈ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. మొదట్లో ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రామ్ చరణ్ కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వార్తలు వినిపించాయి. కానీ చరణ్ ఎన్టీయార్ మధ్య ఫైట్ సీన్ కు సంబంధించిన వార్తలు వస్తూ ఉండటంతో చరణ్ కు కూడా సినిమాలో సమ ప్రాధాన్యత ఇచ్చారని చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫైట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ విషయం బయటకు లీక్ కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ నైజాం హక్కులు 75 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆంధ్ర హక్కులు 100 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు వస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: