అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కియారా  అద్వానీ.  బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా కొసమెరుపు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి.. తన అదిరే అభినయంతో... ఆకట్టుకుంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో... తన హాట్ హాట్ అందాలతో అందరికీ చమటలు పటించే ఎంతో అభిమానులను సంపాదించుకున్నది  ఈ అమ్మడు. ఇక గతేడాది తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ గా వచ్చిన కబీర్  సింగ్ లో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా  నటించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. కబీర్ సింగ్ సినిమాతో కియారా అద్వానీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అనే చెప్పాలి

 


 ఇక అదే ఊపులో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన గుడ్ న్యూస్  సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ అమ్మడి ఖాతాలో మరో సంచలన హిట్ చేరిపోయింది.  ఇక ఇక రెండు భారీ విజయాలు సొంతం చేసుకోవడంతో వరుస అవకాశాలు వచ్చి వాలుతున్నాయి. ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే కియారా అద్వానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు  సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది ఎప్పుడూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భిన్నమైన ఫోటో షూట్లతో తన అభిమానులను సోషల్ మీడియాలో  కూడా ఎప్పుడూ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లక్ష్మీబాంబ్ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా తెలుగులో వచ్చిన కాంచన సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుండగా..  ఈ సినిమాను దర్శకుడు లారెన్స్ తెరకెక్కిస్తున్నారు, హారర్ కామెడీ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 


 అంతే కాకుండా హిందూ కి జవానీ అనే మరో చిత్రంలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. మరో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది. ఈ సినిమాలో ఘజియాబాద్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. అయితే ప్రస్తుతం డేటింగ్ యాప్స్  పెరిగిపోతున్న నేపథ్యంలో అబీర్  గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హాజరైన కియారా అద్వానీ పెళ్లికి ముందు శృంగారం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం పై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అంటూ తెలిపింది. అయితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అనుకుంటేనే రిలేషన్షిప్ కొనసాగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. తాను ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో లేనని తెలిపిన కియారా... ఒకవేళ తను ఎవరితో ప్రేమలో ఉన్న మీడియా ముందు వెల్లడిస్తాను అంటూ తెలిపింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అని డిసైడ్ అయిన తర్వాత రిలేషన్షిప్ మొదలు పెట్టాలనేది తన ఉద్దేశమని.. నమ్మకం ఉన్నప్పుడు శారీరకంగా దగ్గరైనా ఎ mలాంటి తప్పులు లేదంటుంది కియారా అద్వానీ. ప్రస్తుతం ఈ అమ్మడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: