టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు మ‌ధ్య ఉన్న బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు ఓకేసారి కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్ద‌రు హీరోల్లో చిరు హీరోగా న‌టిస్తే... మోహ‌న్ బాబు విల‌న్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు కూడా హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించి క‌లెక్ష‌న్ కింగ్ అయ్యారు. అటు మెగాస్టార్ చిరు నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా అదే మెగాస్టార్‌గా ఉన్నారు. ఇక గ‌తంలో వ‌జ్రోత్స‌వాల టైంలో మోహ‌న్‌బాబు వర్సెస్ చిరంజీవి మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. 

 

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు హీరోలు ఒక్క‌ట‌య్యారు. ఒక‌రిపై మ‌రొక‌రు ఛ‌లోక్తులు, సెటైర్లు విసురు కుంటూనే ఉంటుంటారు. ఇటీవ‌ల మా డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో వీరిద్ద‌రు ఒక‌రిపై మ‌రొక‌రు ఎలా సెటైర్లు వేసుకున్నారో చూశాం. ఇక ఆ త‌ర్వాత మెగాస్టార్ 152వ సినిమాలో మోహ‌న్ బాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇక సైరా నరసింహ రెడ్డి తో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో తన 152 వ సినిమా చేస్తున్నాడు.

 

ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండగా.. సిద్దు.. ఆచార్య అనే రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించబోతున్నారని.. అందులో సిద్దు పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటె తాజాగా ఈ మూవీ లో విలన్ రోల్ కు గాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబును ఎంపిక చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి.

 

దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. మా సినిమాలో మోహ‌న్ బాబు గారు న‌టించ‌డం లేద‌ని.. అలాంటి విష‌యం ఉంటే తామే స్వ‌యంగా తెలియ‌జేస్తామ‌ని క్లారిటీ ఇచ్చింది. దీంతో చిరు సినిమాలో మోహ‌న్ బాబు విల‌న్ అన్న వైర‌ల్ న్యూస్ అంతా ఫేకే అని తేలిపోయింది. చిరు సినిమాలో మోహ‌న్‌బాబు విల‌న్ అన‌డంతో ఫిక్స‌యిన ప్రేక్ష‌కులు నిన్న‌టి వ‌ర‌కు రాసుకు పూసుకు తిరిగారు క‌దా ? అప్పుడే మీ మ‌ధ్య ఏమైందంటూ నెటిజ‌న్లు ఛ‌లోక్తులు విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: