బాలీవుడ్ లో ఎంతో మంది విలక్షణ నటులు ఉన్నారు.  అందులో కొంత మంది పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉంటాయి.  ఇందులో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇర్ఫాన్ ఖాన్ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు.  తెలుగులో కొన్ని సినిమాల్లో విలన్ గానటించిన విషయం తెలిసిందే.  ప్రేక్షకుల్లో ముద్ర పడ్డ ఇర్ఫాన్ ఖాన్ కొన్నాళ్ల క్రితం తాను క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తనకు ప్రేక్షకుల దీవెనులు ఉన్నాయని.. తాను తిరిగి ఆరోగ్యంగా వస్తానని చెప్పిన విషయం తెలిసిందే.  అయితే క్యాన్సర్ ఎటాక్ అయిన ప్రారంభం లో ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు చేశాడు.

 

క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లిన ఇర్ఫాన్ గత ఏడాది తిరిగి వచ్చాడు. భారత్ కి తిరిగి వచ్చిన తర్వాత  ‘అంగ్రేజీ మీడియం’ అనే చిత్రం మొదలు పెట్టారు.  ఈ చిత్రం తన కెరీర్ లో మరో మంచి హిట్ కావాలని అందుకు స్వయంగా తానే ప్రమోషన్ చేస్తానని అన్నారు.  వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చేశారు.  ఆ పోస్ట్ చూసిన వారంతా ఆవేదనకు గురి అవుతున్నారు.  అనారోగ్యంతో బాధపడుతున్న నేను తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ఎంతో ఇష్టంగా ఈ చిత్రంలో నటించానని.. అయితే ఈ చిత్రానికి బాగా ప్రమోట్ చేయాలని అనుకున్నానని.. కానీ  ప్రస్తుతం తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

చికిత్స తర్వాత క్యాన్సర్ నుండి ఇర్ఫాన్ పూర్తిగా తేరుకోలేదని.. అది మళ్లీ ఇప్పుడు తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. ఇర్ఫాన్ ఖాన్ సినిమా ప్రమోషన్స్ లోనే పాల్గొనలేనంతగా ఆయన ఆరోగ్యం క్షీణించింది.  తాజాగా ఇర్ఫాన్ పెట్టిన పోస్ట్ చూసి సెలబ్రెటీలు మాత్రమే కాదు అభిమానులు కూడా కంట తడి పెట్టుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: