టాలివుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దక్షిణాదిలోనే టాప్ హీరోస్ లో మహేష్ బాబు ఒకడు. అందుకే అతని సినిమా విడుదల అవుతుంది అంటే ఆ హీరో ఫాన్స్ ఈ హీరో ఫాన్స్ అనే తేడా లేకుండా సినిమాకు వెళ్ళిపోతారు. ఈ మధ్య మహేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రైతులు, సామాజిక అంశాలతో సినిమాలు చేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు మహేష్ సినిమాను ఆదరిస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఈ జోనర్స్ లో వచ్చినవే. ఇవన్ని హిట్లు గా నిలిచాయి. 

 

ఇదే బాలివుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ని ఫిదా చేసింది అంటున్నాయి టాలివుడ్ వర్గాలు. వాస్తవానికి దక్షిణాదిలో సినిమా చెయ్యాలి అనేది కరణ్ జోహార్ కి ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అయితే ఎవరితో చెయ్యాలో అర్ధం కాక కరణ్ సతమతవుతున్నాడు. ఈ తరుణంలోనే గత నాలుగేళ్ళుగా మహేష్ సినిమాలను కరణ్ ఎక్కువగా పరిశీలిస్తున్నాడట. మహేష్ చేసే కథలు భిన్నంగా ఉండటంతో అతని సినిమాలకు క్రేజ్ అన్ని వర్గాల నుంచి వస్తుంది అనే విషయాన్ని కరణ్ గ్రహించాడు. అది వసూళ్ళకు ప్రధాన బలమైన అంశం అని గుర్తించాడు. 

 

బాలివుడ్ హీరోలు దేశం మొత్తం వంద కోట్లకు పైగా వసూలు చేస్తుంటే మహేష్ ఓన్లీ తెలుగులోనే సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరులో కథ పెద్దగా లేకపోయినా సినిమా భారీ వసూళ్లు సాధించింది. దానికి కారణం మహేష్ క్రేజ్ అనే విషయం కరణ్ కి అర్ధమైంది. అందుకే మహేష్ క్రేజ్ కి అక్కడ ఫిదా అయిపోయాడట కరణ్. ఏది ఏమైనా వచ్చే ఏడాది అతని సినిమా చెయ్యాలని భావిస్తున్నాడని సమాచారం. అవసరమైతే మహేష్ 50 కోట్లకు పైగా పారితోషకం కూడా ఇవ్వాలని భావిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: