‘బాహుబలి’ సినిమా తో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత నటించిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ అయినా గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో అదరగొట్టే రేంజిలో కలెక్షన్లు రాబట్టింది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జిల్ ఫెమ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ సినిమా చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్ లో ప్రభాస్ మరియు హీరోయిన్ పూజా హెగ్డే లపై పడవ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

 

ఈ సన్నివేశాలు అయిన వెంటనే మరొక షెడ్యూల్లో ట్రైన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు ఫిలింనగర్ లో టాక్. అయితే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు ప్రజల పండుగ ఉగాది పండుగ నాడు విడుదల కాబోతున్న ట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. అయితే వచ్చిన వార్తలలో వాస్తవం ఎంత ఉందో ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి జరిగిన షెడ్యూల్ బట్టి చూస్తే కేవలం మూడు చిన్న చిన్న షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

 

అయితే ఇప్పటివరకు అయిన షూటింగ్ బట్టి చూస్తే ఫస్ట్ లుక్ అనేది కష్టమే అని కుదిరితే చిత్ర టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ఇదే తరుణంలో ఇటీవల కృష్ణంరాజు కూడా మాట్లాడుతూ ఫస్ట్ లుక్ గురించి పెద్దగా స్పందించకుండా సినిమా ఈ ఏడాది చివరి నా లేకపోతే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ కెరీర్ లో ఇప్పటివరకు టచ్ చేయని లవ్ స్టోరీని ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నట్లు కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: