మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తో తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని భారీ హిట్ కొట్టి నిరూపించారు. ఆ తర్వాత ఎప్పటి నుంచో కలగంటున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ' సైరా' సినిమాని చేశారు. ఈ సినిమా కూడా మంచి సక్సస్ ని అందుకోవడమే కాదు  విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా మెగాస్టార్ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ఎంటర్టైనర్ కోసం టాలీవుడ్ సక్సస్ ఫుల్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తో కలిసి సెట్స్ మీద ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల క్రేజ్ తో ఈ తాజా చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అని ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నారు. 

 

అయితే ఇప్పుడు చిరు కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరు క్యూ కడుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే సుకుమార్, చిరంజీవిని కలిసి... లూసిఫెర్ స్క్రిప్ట్‌లో వచ్చిన మార్పులపై చర్చించారని తెలుస్తోంది. కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా కంప్లీటయిన తర్వాత సుకుమార్ సినిమా లో చిరు నటించే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అలాగే త్రివిక్రంతోను చిరు సినిమా 2021 లో మొదలవబోతుందని తెలుస్తోంది.

 

ఇందులో భాగంగా ఏ దర్శకుడు చిరు వద్దకు వచ్చినా.. సమాజానికి ఉపయోగపడే కథలతో రావాలని.. తాను చేసే సినిమాలు కంప్లీట్ మెస్సేజ్ ఓరియెంటెడ్ గా ఉండాలని.. చిరు వాళ్ళకి సూచిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు అభిమానుల కోసం చేసిన కమర్షియల్ సినిమాలు ఒక ఎత్తైతే.. ఇప్పటినుండి చేసే సినిమాలు ఒక ఎత్తులో ఉండాలని.. వాళ్ళకి చెబుతున్నాడట. మరి కొరటాల అలా మెస్సేజ్ ఓరియెంటెడ్ కథతో రావడం.. చిరు కూడా అదే మూడ్ లో ఉండడటంతో.. వాళ్ళ ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్లుగా తెలుస్తుంది. మరి సుకుమార్ లూసిఫెర్ రీమేక్ అనుకున్నా... ఇక త్రివిక్రమ్ లాంటి మిగతా దర్శకులు సోషల్ మెస్సేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ తో చిరు ని మెప్పించాలని అర్థమవుతోంది. సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: