టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలంగా హిట్ లేక సతమతమవుతున్న అల్లు అర్జున్ కి... అల వైకుంఠ పురములో సినిమాతో భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠ పురం లో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి  అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డుల పరంగా కూడా అల్లు అర్జున్ సినీ కెరీర్లోనే బెస్ట్ రికార్డులు సృష్టించింది అని చెప్పవచ్చు. అలా వైకుంఠపురములో సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన రెండో సారి పూజా హెగ్డే జోడీ కట్టింది. ఇక ఈ సినిమాలో మాటల మాంత్రికుడు తనదైన డైలాగులతో అందరిని మాయ చేసాడు అని చెప్పాలి. 

 

 

 ఇకపోతే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే  తండ్రి నిర్మాతగా ఉన్నప్పుడు అల్లు అర్జున్ పారితోషకం విషయంలో ఎలా ఉంటారు అనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. అయితే తాజాగా అల వైకుంఠపురములో  సినిమాలో  అల్లు అర్జున్  తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు తన తండ్రి నిర్మాత అయిన పారితోషకం  విషయంలో మాత్రం ఎలాంటి మొహమాటాలు లేదు అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. పారితోషికం విషయంలో తమ ఇద్దరి మధ్య బన్నీ వాసు మీడియేటర్ గా  వ్యవహరించాడని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లుఅర్జున్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

 

 

 ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా యూఎస్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా  కూడా రికార్డులు సృష్టించింది ఈ సినిమా. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లు అర్జున్ అల వైకుంఠ పురంములో సినిమా విజయం అల్లు అర్జున్ కి  మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ  సినిమాలో నటిస్తున్నారు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: