టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు జడ్జిమెంట్ పై చాలామందికి నమ్మకం ఉంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి బయ్యర్గా మారిన దిల్ రాజు అక్కడ నుంచి వెను దిరిగి చూసుకోలేదు. నేడు టాలీవుడ్లో దిల్ రాజు పెద్ద బడా నిర్మాతగా మారిపోయారు. ఆయన బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు మూమూలుగా ఉండవు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టే ప్రేక్షకులు ఆయన జడ్జిమెంట్ ను నమ్మడం మొదలుపెట్టారు.
దిల్ రాజు సినిమా అంటే సూపర్ హిట్ అన్న టాక్ ఉండేది. అయితే అదంతా గతం.. ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి వస్తోన్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. శ్రీనివాస కళ్యాణం , లవర్ , ఇద్దరిలోకం ఒకటే లాంటి సినిమాలు వరుసడా డింకీ కొట్టేశాయి. మధ్యలో ఎఫ్ 2 లాంటి హిట్లు వస్తున్నా వరుస ప్లాపులే ఎక్కువ ఉంటున్నాయి. రీసెంట్గా రాజు గారి బ్యానర్ నుంచి వచ్చిన జాను కూడా అదే లిస్టులో చేరిపోయేలా ఉంది.
జాను పైగా కోలీవుడ్లో హిట్ అయ్యింది. ఆ సినిమా గురించి ఇక్కడ రాజు గారు ఎంత బాకా ఊదినా జనాలు మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే దిల్ రాజు తాను నమ్మి కొంత మంది దర్శకుల చేతుల్లో సినిమాలు పెడుతుంటే వాళ్లు మాత్రం ఆయనకు బాగా దెబ్బేస్తున్నారని ఈ సినిమాల రిజల్ట్ చూస్తేనే అర్థమవుతోంది. మరి ప్రేక్షకుల అభిరుచులు రోజు రోజుకు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజు గారు కూడా అప్ డేట్ అయ్యి.. తన జడ్జ్ మెంట్ మార్చుకుని మరింత పదును పెడతారేమో ? చూడాలి. లేకపోతే కాలం గడిచే కొద్ది ఈ ఫ్లాపుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.