గత కొంత కాలం నుండి చేస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో బాలయ్య బాబు తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా కొట్టించుకున్నాడు. అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఇదే లుక్కుతో హాజరయ్యారు. దీంతో చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. నందమూరి బాలయ్య బాబు అభిమానులైతే చాలా బాగుంది బాలయ్య బాబు గెటప్ అంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నటు ఫ్యాక్షనిస్ట్ తరహాలో బాలయ్య క్యారెక్టర్ ఉంటున్నట్లు సమాచారం.

 

అప్పట్లో బాలయ్య బాబు నటించిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి తరహాలో బోయపాటి తో చేయబోయే సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఆ స్థాయిలో ఉండబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇదే తరుణంలో బాలయ్యకి ఫ్యాక్షనిస్ట్ సెంటిమెంట్ ఉండటం మరియు అదే విధంగా బోయపాటికి బాలయ్య బాబుతో డబల్ క్యారెక్టర్ చేస్తే గ్యారెంటీగా సినిమా హిట్ అవటం సెంటిమెంట్. ఈ రెండు విషయాలను సినిమా స్టోరీ చెప్పకుండా బాలయ్యకు చెప్పటంతో బాలయ్య మనసు అప్పుడే బోయపాటి గెలుచుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

ఈనెల 26 నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ వారణాసిలో జరగబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒకటి ఫ్యాక్షనిస్టు పాత్ర అయితే మరొకటి అఘోరా పాత్రలో బాలయ్య బాబు నటిస్తున్నారట. సినిమా మొత్తానికి హైలెట్ అఘోర పాత్ర అనే టాక్ గట్టిగా వినబడుతుంది. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నాడు. ఈ మూవీలో బాలకృష్ణ సరసన నయనతార, శ్రియ నటించబోతున్నట్టు సమాచారం. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో రెండు హిట్లు పడటంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య బాబు అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: