టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాలో విజయ్ సరసన ఏకంగా నలుగురు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్,రాశీ ఖన్నా,క్యాథెరిన్ మరియు ఇలజబెల్ లెయిట్ నటించారు. టాలీవుడ్ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాల నిర్మాత అయిన కేఎస్.రామారావు ఈ సినిమాను నిర్మించారు. కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఈ రోజు ప్రేమికుల రోజు కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
విజయ్ దేవరకొండ నటించిన నోటా, డియర్ కామ్రేడ్ లాంటి ప్లాప్ తర్వాత కూడా మంచి అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు ముందే రు. 30. 50 కోట్ల బిజినెస్ చేసిందంటే విజయ్ కు వరుస ప్లాపులు వచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ ఈ సినిమా బిజినెస్ మీద ఎంత మాత్రం పడలేదని అర్థమవుతోంది.
ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వలర్డ్ ఫేమస్ లవర్ ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ల రూపంలో ప్రదర్శించ బడుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సరికి జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఫస్టాఫ్లో ఇప్పటి వరకు వచ్చిన ఎమోషన్స్ బాగున్నాయి.అలాగే విజయ్ మేకోవర్ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. ఇక హీరోయిన్ రాశీ ఖన్నా , విజయ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఇప్పటికి నలుగురిలో ముగ్గురు హీరోయిన్లు పరిచయం అయ్యిపోయారు.
అయితే రొమాన్స్ సీన్లు బాగున్నట్టు ఉన్నా కథనం మాత్రం అలా నెమ్మదిగా సాగుతున్న భావన ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది.విజయ్ కు ఐశ్వర్య రాజేష్ మరియు రాశీ ఖన్నాల మధ్య ట్రాక్స్ తప్ప ఫస్ట్ హాఫ్ లో ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు.మరి సెకండాఫ్ను బట్టి ఈ సినిమా రిజల్ట్ ఆథారపడి ఉంటుంది.