ఈరోజు భారీ అంచనాలతో వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఊహించిన విధంగానే సగటు ప్రేక్షకుడు ని నిరాశ పరిచింది అని వార్తలు వస్తున్నాయి. దీనితో విజయ్ కు మరొకసారి వరస ఫెయిల్యూర్ ఎదురైంది. ఇప్పటికే విజయ్ ఎదుగుదలను చూసి ఈర్ష్య పడుతున్న చాలా మందికి ఈ వార్త విపరీతమైన జోష్ ను కలిగిస్తోంది.


దీనితో ఇక విజయ్ నిలదొక్కుకోవాలి అంటే కేవలం పూరీ జగన్నాథ్ మూవీ ప్రాజెక్ట్ పైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పూరీ జగన్నాథ్ ట్రాక్ ను పరిశీలిస్తే వరస హిట్స్ పూరీ సినిమాలకు రావడం లేదు. ఒక హిట్ వచ్చిన తరువాత మళ్ళీ పూరి మరొక హిట్ తీయడానికి చాల కష్టపడవలసి వస్తోంది. 


‘ఇస్మార్ట్ శంకర్’ కు ఊహించని విజయం రావడంతో ఆ ట్రాక్ ను కొనసాగించడానికి పూరి విజయ్ తో చేతులు కలిపి బాలీవుడ్ లో కరణ్ జోహార్ సహాయం తీసుకుని ఈ మూవీని చాల భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకు జాన్వీ మ్యానియా కూడ జత చేయాలని ఎంత ప్రయత్నించినా జాన్వీ కనికరించక పోవడంతో పూరీ అంచనాలు మొదట్లోనే దెబ్బ తిన్నాయి. అయినప్పటికీ ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి తనకు అదేవిధంగా విజయ్ కి కెరియర్ బ్రేక్ తెప్పించాలని పూరీ చాల గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. 


వాస్తవానికి విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీ బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ కావడంతో ఆ రీత్యా బాలీవుడ్ మీడియాకు విజయ్ దేవరకొండ పేరు తెలిసినా విజయ్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పూర్తిగా తెలియదు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడ విజయ్ మ్యానియా సన్నగిల్లిన పరిస్థితులలో నేషనల్ సెలెబ్రెటీగా విజయ్ ని మార్చాలని పూరీ చేస్తున్న ప్రయత్నాలకు బయ్యర్ల నుండి స్పందన ఎలా వస్తుంది అన్న విషయం పక్కకు పెడితే ఈ మూవీ ఫలితం కూడ వస్తే విజయ్ దేవరకొండ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: