టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమిళనాట ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రజినీకాంత్ సినిమాలు వస్తున్నాయంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఎంతో హడావుడి చేస్తుంటారు.  దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు.  వైద్య వృత్తిలో ఉన్న వీరబాబు మనపక్కం వద్ద రజనీకాంత్ పోస్టర్లతో హోటల్‌ను  ఏర్పాటు చేశాడు. భోజనం కాకుండా, దోశ, ఇడ్లీలతోపాటు ఇతర బియ్యం రకాలు కూడా మెనూలో ఉన్నాయి. సరసమైన ధరల్లో, ఆరోగ్యకరమైన భోజనం అందించడం ఆసక్తికరమైన విషయం.  ధారణ గదిలో కూర్చొని భోజనం చేసినా, ఏసీ గదిలో కూర్చొని చేసినా..ప్లేట్ భోజనంకు రూ.10లు, అన్ లిమిటెడ్ భోజనంకు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.

 

ఇతర హోటళ్లకు ధీటుగా అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగ వడ్డిస్తారు.  అంతే కాదు ఏలాంటి వారికైనా ఇక్కడ బోజనంచేస్తే ప్రత్యేక ఛార్జీలేవీ వసూలు చేయరు. అంతేకాదు అతి తక్కువ ధరకే కడుపునింపుతున్నారు. కార్మికులు, కూలీలతో ఆ హోటల్ మధ్యాహ్న వేళల్లో కిటకిటలాడుతోంది.  సాధారణంగా ఏసి రూముల్లో భోజనం చేస్తే ప్రత్యక ఛార్జీలు వసూళ్లు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కేవలం రూ.30లకు అన్ లిమిటెడ్ భోజనంతో కడుపు నింపుకోగలుగుతున్నామని కార్మికులు, కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘శ్రమజీవి హోటల్’ పేరుతో నడుస్తున్న ఈ హోటల్ బ్రాంచ్‌లను చెన్నైలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.

 

ప్లేట్ భోజనాన్ని కేవలం రూ.10లకు వడ్డిస్తున్నారంటే ఊహించలేము.  అయితే ఈ హోటల్ యజమాని వీరబాబు మాట్లాడుతూ.. ఇది ఏలాంటి లాభాపేక్ష కోసం చేస్తున్నది కాదని.. రజినీకాంత్ అంటే ఎంతో అభిమానం.. ఆయన పేరుతో సేవా దృక్పథంతో చేస్తున్న పని అన్నారు. ఈ హోటల్ తో రజనీకాంత్ కు ప్రజాదరణ పెరగాలని, రాజకీయ పయనంలో ఎక్కువ మంది ప్రజలు రజనీకి మద్దతు ఇస్తారని అంటున్నారు. రజీనీ మంచి వ్యక్తి అని, తన రాజకీయ ప్రస్థానంతో మొత్తాన్ని మారుస్తుందని డాక్టర్ వీరబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: